పోలింగ్ ముగిసిన తర్వాత వైఎస్సార్సీపీ మూకల రాళ్ల దాడి - 8 మందికి గాయాలు - YSRCP Mob Attack

By ETV Bharat Andhra Pradesh Team

Published : May 14, 2024, 9:09 AM IST

thumbnail
పోలింగ్ ముగిసిన తర్వాత వైఎస్సార్సీపీ మూకల రాళ్ల దాడి - 8 మందికి గాయాలు (ETV Bharat)

YSRCP Mob Attack on TDP Leaders in Tirupathi District : తిరుపతి జిల్లాలో ఎన్నడూ లేని విధంగా ఈసారి వైఎస్సార్సీపీ శ్రేణులు అరాచకం సృష్టించారు. చంద్రగిరి మండలం రామిరెడ్డిపల్లి పంచాయతీ తెలుగుదేశంకు అనుకూలంగా ఓట్లు వేస్తున్నారని వైఎస్సార్సీపీ వర్గీయులు పోలింగ్​ ప్రక్రియ పూర్తి అయిన తరవాత గ్రామంలోకి రాళ్లు విసిరారు. ఈ సంఘటనలో ఎనిమిది మందికి గాయాలు అయ్యాయి. ఈ ఘటనతో గ్రామంలో ఉద్రిక్తతకు దారి తీసింది. క్షతగాత్రులను తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించారు. 

వైఎస్సార్సీపీ నాయకులు ఆగ్రహంతో అక్కడే ఉన్న కారుకు నిప్పంటించారు. మరో కారు అద్దాలు పగులగొట్టారు. గ్రామంలోనే ఉన్న వైఎస్సార్సీపీ అభ్యర్థి చెవిరెడ్డి మోహిత్​ రెడ్డి, అతని తమ్ముడు హర్షిత్​ రెడ్డి గ్రామం నుంచి వెళ్లకుండా స్థానికులు అడ్డుకున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న టీడీపీ అభ్యర్థి పులివర్తి నాని అతని తనయుడు వినీల్​కు సర్ది చెప్పి అక్కడి నుంచి పంపించి వేశారు. వైఎస్సార్సీపీ అభ్యర్థి మోహిత్‌ రెడ్డి, అతని తమ్ముడు హర్షిత్‌ రెడ్డిపై స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. గ్రామంలో శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా పటిష్ఠ బందోబస్తును పోలీసులు ఏర్పాటు చేశారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.