తమను చూసి కాదు- జగన్​ను చూసి ప్రజలు ఓట్లు వేస్తారు! : మంత్రి ఆదిమూలపు సురేశ్​

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 17, 2023, 4:41 PM IST

thumbnail

Minister Adimulapu Suresh Comments: ప్రకాశం జిల్లాలోని ఎర్రగొండపాలెం, కొండపి నియోజకవర్గంలో ఎవరు ఎన్నికల్లో పోటీ చేసిన ఆ సీట్లు కచ్చితంగా వైసీపీనే సాధించుకుంటుందని మంత్రి ఆదిమూలపు సురేశ్​ జోష్యం చెప్పారు. ఎన్నికల బరిలో ఎవర్ని దింపిన అవి వైసీపీ సీట్ల కిందనే లెక్క అని ఆయన అన్నారు. ప్రజలు తమ నాయకుడు జగనన్న మీద ఉన్న నమ్మకం భరోసాతోనే, ఎవరు ఎన్నికల్లో పోటీ చేసిన గెలిపిస్తారన్నారు. తాము శాశ్వతం కాదని జగనన్న పేరు చెప్పుకుని ఏదో ఓట్లు అడుగుతామని ఆయన వివరించారు.  

వైఎస్సార్​ కాంగ్రెస్​ పార్టీ రాజకీయ వ్యుహంలో భాగంగానే పార్టీలో అభ్యర్థుల మార్పులు జరుగుతున్నాయని మంత్రి  సురేశ్​ ప్రకటించారు. పార్టీ విధి విధానాలను బట్టి అభ్యర్థుల మార్పులు ఉంటాయని ఆయన అన్నారు. మంత్రి ఆదిమూలపు సురేశ్​ని ఎర్రగొండపాలెం నియోజకవర్గం నుంచి కొండపి నియోజకవర్గానికి పార్టీ అదిష్ఠానం మార్చింది. ఈ నేపథ్యంలో ఒంగోలులోని మంత్రి క్యాంపు కార్యాలయంలో కొండపి నియోజకవర్గ వైసీపీ నాయకులతో మంత్రి సమావేశం నిర్వహించారు. వైసీపీ శ్రేణులు, నాయకులు, కార్యకర్తలు కలిసికట్టుగా వీరసైనికుల్లా పని చేస్తామని మంత్రి అన్నారు. 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.