రోడ్డు ప్రమాదంలో చెలరేగిన మంటలు- పూర్తిగా దగ్ధమైన వాహనం

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 16, 2023, 12:26 PM IST

thumbnail

Lorry Driver Died in Accident on National Highway: జాతీయ రహదారిపై జరిగిన ప్రమాదంలో లారీ డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఇద్దరికి గాయాలయ్యాయి.  ఈ ఘటన ప్రకాశం జిల్లా మార్కాపురం మండలం నికరంపల్లి వద్ద జాతీయ రహదారిపై చోటుచేసుకుంది. క్షతగాత్రులు ఇద్దరు తమిళనాడుకి చెందిన వారిగా గుర్తించారు. ప్రమాదంలో బొలెరో వాహనం దగ్ధమవ్వగా, లారీ పూర్తిగా ధ్వంసమైంది.  

Road Accident in Prakasam District: శనివారం ఉదయం చెప్పుల లోడుతో వెళ్తున్న బొలెరో వాహనం, లారీ వేగంగా ఢీకొనటంతో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో చెప్పుల లోడుతో వెళ్తున్న బొలెరో వాహనం పూర్తిగా దగ్ధమైంది. లారీ డ్రైవర్ సెందిల్ కుమార్ మృతి చెందారు. ఇద్దరికి స్వల్ప గాయాలవ్వడంతో మంటల నుంచి క్షేమంగా బయటపడ్డారు. ప్రమాదంలో గాయపడిన ఇద్దరిని స్థానికులు చికిత్స నిమిత్తం మర్కాపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. స్థానికుల ఇచ్చిన సమాచారంతో ఘటనా స్థలానికి పోలీసు బృందం చేరుకుంది. ప్రమాదం జరిగిన తీరును పోలిసులు పరిశీలించి కేసు నమోదు చేసుకున్నారు. క్షతగాత్రులు ఇద్దరు తమిళనాడుకు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.