'బేరాల్లేక నష్టపోతున్నాం' - గాంధీ పార్కులో ఆటోవాలాల ఆందోళన

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 11, 2023, 5:10 PM IST

thumbnail

Labor Union Leaders Are Concerned : విశాఖ ఆర్కే బీచ్​లో జీవీఎంసీ అధికారులు ఏర్పాటు చేసిన ఎలక్ట్రిక్​ ఆటోలను వెంటనే తొలగించాలని కార్మిక సంఘ నాయకులు గాంధీ పార్కులో ఆందోళన చేపట్టారు. ఆరు నెలల క్రితం అధికారులు 10 ఎలక్ట్రిక్​ ఆటో రిక్షాలను తీర ప్రాంతం నుంచి సాగర్​ నగర్​ వరకు గర్భణులు, వికలాంగులు, వృద్ధులకు ఉచితంగా ఏర్పాటు చేశారని ఏఐటీయూసీ అధ్యక్షుడు షేక్​ రహిమాన్ వెల్లడించారు​. 

Demand to Cancel Electric Autos : గర్భిణులు, వికలాంగులు, వృద్ధులకు ఎలక్ట్రిక్ ఆటోలను నడిపితే తమకు ఎటువంటి ఇబ్బంది లేదని, ఇందుకు విరుద్ధంగా బీచ్​ సందర్శనకు వచ్చిన వారితో డబ్బులు వసూలు చేసున్నారని పేర్కొన్నారు. దీని వల్ల తమ ఆటోలకు బేరాలు లేక ఆర్థికంగా నష్టపోతున్నామని పేర్కొన్నారు. జీవీఎంసీ అధికారులు ఎలక్ట్రిక్ ఆటోలను రద్దు చేయాలని  కోరుకున్నారు. లేని పక్షంలో డ్రైవర్లకు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్​ చేశారు. తమ సమస్యను జీవీఎంసీ అధికారులు పరిష్కరించే వరకు ఆందోళనలు కొనసాాగిస్తామని సృష్టం చేశారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.