JNTU Suspended Employee Fire On YSRCP Govt: 'వైసీపీ రాజ్యంలో కులవివక్ష.. విశ్వ విద్యాలయాల్లో వైఎస్సార్ రాజ్యాంగం'

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 4, 2023, 3:43 PM IST

thumbnail

JNTU Suspended Employee Fire On YSRCP Govt : వైసీపీ రాజ్యంలో విధులు నిర్వహించలేనని మీడియాలో చెబితే.. తనను సస్పెండ్ చేశారని జేఎన్టీయూ సస్పెండ్ ఉద్యోగి (సూపరింటెండెంట్) ఎండీ నాగభూషణం మండిపడ్డారు. గతంలోనే బలవంతపు పదవి విరమణ చేసేలా ఒత్తిడి తెచ్చారని ఆయన ఆరోపించారు. అనంతపురంలోని ఉపాధ్యాయ భవన్​లో ఎండి నాగభూషణం మీడియాతో మాట్లాడారు. ఎలాంటి తప్పు చేయకపోయినా 2020లో కలికిరిలో ఉన్న జేఎన్​టీయూ (JNTU)కు బలవంతంగా బదిలీ చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యోగులను జగన్మోహన్ రెడ్డి ఇబ్బందులు పెట్టినట్లుగా చంద్రబాబు పెట్టలేదని చేసిన వ్యాఖ్యలను తప్పు పట్టి వేధిస్తున్నారన్నారు. 

బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తినని తీవ్ర అవస్థలు పెట్టి బలవంతంగా విధుల నుంచి తప్పుకునేలా చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. విశ్వవిద్యాలయాల్లో ఒక కులానికే ప్రాధాన్యత ఇస్తున్నారని ఎండీ నాగభూషణం (Nagabhushanam) నిప్పులు చెరిగారు. వైసీపీ ప్రభుత్వం (YSRCP Govt)లో కుల వివక్ష వేళ్లూనుకుందన్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డి బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలను మోసం చేస్తున్నారని మండిపడ్డారు. తనకు న్యాయం చేయకపోతే బీసీ, ఎస్సీ, ఎస్టీ సంఘాలతో కలుపుకుని ఆందోళన చేస్తామని హెచ్చరించారు. 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.