ముద్రగడతో భేటీ కానున్న జనసేన అధినేత పవన్

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 14, 2024, 9:24 AM IST

Updated : Jan 14, 2024, 9:29 AM IST

thumbnail

Pawan Kalyan Will Be Meets Mudragada: ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఏపీ రాజకీయాలు కాకరేపుతున్నాయి. కుల సమీకరణాలతో ఒక్కరి కంటే ఒక్కరు ముందుకు సాగుతున్నారు. కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభంను తమవైపు లాగుకోవాలంటూ వైఎస్సార్సీపీ, జనసేన నేతలు మంతనాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ముద్రగడ ఎవ్వరివైపు మెుగ్గుతారో అన్న ఉత్కంఠ రేగుతున్న సమయంలో , ఈ నెల 20 లేదా 23న ముద్రగడతో పవన్ భేటీ అవుతారని జనసేన వర్గాలు వెల్లడించడం ఆసక్తిగా మారింది. 

జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌, ముద్రగడ పద్మనాభంను కలవబోతున్నారు. ఈనెల 20 లేదా 23వ తేదీన కాకినాడ జిల్లా కిర్లంపూడికి పవన్ కల్యాణ్‌ స్వయంగా వచ్చి ముద్రగడతో భేటీ అవుతారని జనసేన నేత బొలిశెట్టి శ్రీనివాస్ తెలిపారు. రెండు రోజుల క్రితం ముద్రగడను కలిసిన బొలిశెట్టి శ్రీనివాస్ఆ యన ఇచ్చిన లేఖను జనసేన అధినేత పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లారు. ఆ తర్వాత ఇవాళ మరోసారి కిర్లంపూడికి వచ్చిన బొలిశెట్టి శ్రీనివాస్ము ద్రగడను కలిసి చర్చించారు. ముద్రగడ లాంటి వ్యక్తి వల్ల సమాజానికి మంచి జరుగుతుందని బొలిశెట్టి అన్నారు. 

Last Updated : Jan 14, 2024, 9:29 AM IST

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.