Infrastructure in Cent Plots: పేదలకు ఇచ్చిన స్థలంలో.. మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం చర్యలు

By

Published : Jul 18, 2023, 9:10 AM IST

thumbnail

Infrastructure Creation in Cent Plots: రాజధాని అమరావతి ప్రాంతంలో పేదలకు ఇచ్చిన సెంటు స్థలంలో మౌలిక వసతుల కల్పనపై ప్రభుత్వం చర్యలు చేపట్టింది. మంగళగిరి మండలం కృష్ణయపాలెం లేఔట్‌లో సుమారు 900 మంది పేదలకు సెంట్ స్థలాలను ప్రభుత్వం కేటాయించింది. ఈ స్థలాలలో విద్యుత్ సరఫరా కోసం స్తంభాలను పాతారు. ఈనెల 24వ తేదీన సెంట్ స్థలాల్లో ఇళ్ల నిర్మాణానికి ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఈ ప్రాంతంలో భారీ శిలాఫలకం ఆవిష్కరించి భూమి పూజ చేయనున్నారు. ముఖ్యమంత్రి ఈ ప్రాంతాన్ని పర్యటించేలోపు విద్యుత్ లైన్ల పనులు పూర్తి చేయాలని అధికారులు నిర్ణయించారు. మరోవైపు ఆదివారం రాత్రి ఈ ప్రాంతంలో కురిసిన చిన్నపాటి వర్షానికి సెంట్ స్థలాలలో నీరు చేరింది. తేలికపాటి వర్షానికి నీళ్లు చేరితే రాబోయే రోజుల్లో భారీ వర్షాలు కురిస్తే ఈ ప్రాంతం చెరువుగా మారుతోందని స్థానికులు చెబుతున్నారు. నీళ్లు నిలువ ఉండే ప్రాంతంలో పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చి వారిని ప్రభుత్వం మోసం చేస్తోందని ఆరోపించారు. 

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.