నిండిన చెరువు.. ఆగిన రాకపోకలు

By

Published : Dec 12, 2022, 7:32 PM IST

Updated : Feb 3, 2023, 8:35 PM IST

thumbnail

Storm effect: మాండౌస్ తుపాను ప్రభావంతో రాష్ట్రంలోని చెరువులు నిండి, గట్టులపై నుంచి నీరు పారుతున్నాయి. తుపాను కారణంగా గత మూడు రోజులుగా పడుతున్న వర్షాలకు చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గం పెద్దపంజాణి మండలంలోని శంకర్రావుపేట చెరువు నిండింది. దీంతో ఆ మార్గంలో రాకపోకలు కొంతమేర స్తంభించాయి. వర్షాలు ఎక్కువైతే ఈ మార్గంలో రాకపోకలు పూర్తిగా స్తంభించే అవకాశం ఉందని స్థానికులంటున్నారు. మరోవైపు చెరువు నిండా నీళ్లు ఉండటంతో.. ఈ దృశ్యాన్ని చూసేందుకు చాలామంది అక్కడకు చేరుకుంటున్నారు.

Last Updated : Feb 3, 2023, 8:35 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.