Farmers Protest for Compensation in Kalyanadurg: నష్టపరిహారం కోసం.. కళ్యాణదుర్గంలో రైతుల నిరసన

By

Published : Aug 18, 2023, 5:29 PM IST

thumbnail

Farmers Protest for Compensation in Kalyanadurg: అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో భూనిర్వాసిత పోరాట కమిటీ ఆధ్వర్యంలో.. రెవెన్యూ కార్యాలయం ఎదుట రైతులు నిరసన చేపట్టారు. గత ప్రభుత్వం హయాంలో కుందుర్పి, భైరవానితిప్ప బ్రాంచి కెనాళ్ల కోసం ఆ ప్రాంతంలోని కొందరు రైతులు తమ భూములను కోల్పోయారు. భూములు కోల్పోయిన రైతుల్లో కొంతమందికి మాత్రమే అప్పటి ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించిందని భూనిర్వాసిత పోరాట కమిటీ అధ్యక్షుడు రాహుల్ పేర్కొన్నారు. దీంతో ఆ సమయంలో ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్‌.. వైయస్సార్​ కాంగ్రెస్​ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే కుందుర్పి, భైరవానితిప్ప బ్రాంచి కెనాళ్ల కోసం భూమి కోల్పోయిన వారందరికీ నష్టపరిహారం చెల్లిస్తామని హామీ ఇచ్చారని రాహుల్​ తెలిపారు. గత నెలలో రైతు దినోత్సవ కార్యక్రమంలో భాగంగా తమ ప్రాంతానికి వచ్చిన సీఎం జగన్.. నష్టపరిహారం ఊసే ఎత్తకుండా వెళ్లిపోయారని రైతులు వాపోయారు. ఈ కెనాళ్ల తవ్వకం కోసం భూములు ఇచ్చి చాలా నష్టపోయామని..  ఈ అంశంపై ప్రభుత్వం వెంటనే స్పందించి తమకు నష్టపరిహారం చెల్లించాలని రైతులు డిమాండ్‌ చేశారు. 

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.