'బాబు ష్యూరిటీ - భవిష్యత్ గ్యారెంటీ' - టీడీపీలోకి 230 కుటుంబాలు

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 25, 2023, 3:16 PM IST

thumbnail

Families Joined TDP from YCP : వైఎస్సార్​ జిల్లా కమలాపురం నియోజకవర్గం పెండ్రిమర్రి మండలం వెల్లటూరులో ఆదివారం సుమారు 230 కుటుంబాలు టీడీపీలో చేరాయి. టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పుత్తా నరసింహా రెడ్డి 'బాబు ఘ్యారిటీ భవిష్యత్తుకు గ్యారంటీ' అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన నరసింహా రెడ్డిని ప్రజలు ఘనంగా స్వాగతం పలికారు. నరసింహా రెడ్డి ఇంటింటికీ వెళ్లి టీడీపీ పథకాల గురించి ప్రజలకు వివరించారు.

YCP Leaders Who Joined TDP Party : 'బాబు ఘ్యారిటీ భవిష్యత్తుకు గ్యారంటీ' అనే కార్యక్రమానికి ఆకర్షితులైన పలువురు వైసీపీ నాయకులు నరసింహా రెడ్డి సమక్షంలో టీడీపీలో చేరారు. పార్టీలో చేరిన వారికి టీడీపీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. తెలుగుదేశం పార్టీని నమ్మి చేరిన వారందరికి కృతజ్ఞతలు తెలిపారు. వారికి ఏ అవసరం వచ్చినా పార్టీ, తాను అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఇన్ని కుటుంబాలు టీడీపీ చేరడం చాలా సంతోషంగా ఉందని నరసింహా రెడ్డి పేర్కొన్నారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.