పంట నష్టంపై రైతులకు భరోసా ఏదీ - మొలకెత్తిన వరి పనలతో నిరసన

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 11, 2023, 5:53 PM IST

thumbnail

EX-Minister Kollu Ravindra Protest At Collectorate In Krishna District : మిగ్‌జాం తుపాన్ ధాటికి నీట మునిగి మొలకొచ్చిన వరి కంకులను నెత్తిన పెట్టుకుని కృష్ణా జిల్లా కలెక్టరేట్‌ ఎదుట టీడీపీ మాజీ మంత్రి కొల్లు రవీంద్ర వినూత్న రీతిలో నిరసన తెలియజేశారు. వర్షానికి రంగు మారిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. అనంతరం జిల్లా కలెక్టర్ పి. రాజాబాబుని కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ డిప్యూటీ స్పీకర్ బూరగడ్డ వేదవ్యాస్ తో పాటు జనసేన నాయకులు బండి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. 

TDP Leders Protest For Farmers : ముఖ్యమంత్రి పర్యటనలో ఎక్కడో దూరంగా నిలబడి అధికారులు చూపిస్తుంటే చూశారు కానీ, రైతులకు భరోసా ఇవ్వలేదు అని కొల్లు రవీంద్ర అన్నారు. పంట నష్టంపై జగన్మోహన్​ రెడ్డి ఎటువంటి చర్యలు తీసుకోలేకపోయారని అసంతృప్తి వ్యక్తం చేశారు. నష్టపోయిన అన్నదాతలకు వారు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.