Rajanna Dora Sensational Comments: ఉప ముఖ్యమంత్రి రాజన్న దొర కీలక వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..!

By

Published : May 8, 2023, 10:00 AM IST

thumbnail

Gadapagadapaku mana prabhutvam program: సెటిలర్స్​పై డిప్యూటీ సీఎం రాజన్న దొర కీలక వ్యాఖ్యలు చేశారు. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు మండలం కొట్టిపరువు పంచాయతీ కేంద్రంలో ఆదివారం ఉప ముఖ్యమంత్రి రాజన్న దొర గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రెస్ ​మీట్​లో మాట్లాడుతూ.. ఇక్కడ వ్యవసాయం, వ్యాపారం చేస్తున్న సెటిలర్లు భారీ వాహనాలను తిప్పుతుండడంతో రోడ్లన్నీ గుంతలమయంగా మారుతున్నాయి. 

ఇలా పాడైన వాటిని బాగు చేసేందుకు ఏ ఒక్కరూ కూడా ముందుకు రావడం లేదు. కొట్టు పరువు పంచాయితీలో రోడ్లు వేయాలని చూస్తే ఓ సెటిలర్ రోడ్డు వేయకుండా ఆపారు.. అది సరికాదు అని.. గిరిజనులకు న్యాయం చేసేందుకు ఈ విషయాన్ని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్తానని తెలిపారు. ఈ ప్రాంతాన్ని షెడ్యూల్ ఏరియాగా ప్రకటిస్తే ఎక్కువగా నష్టపోయేది సెటిలర్లే అని రాజన్న దొర పేర్కొన్నారు. గిరిజన గ్రామాల్లో రోడ్లు వేసినా, వంతెనలు కట్టినా.. గిరిజనులకు ఉపయోగం తక్కువ.. సెటిలర్లకు వినియోగం ఎక్కువగా ఉందని రాజన్న దొర అన్నారు. 

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.