Customs Officials Search in Vijayawada: విజయవాడలో కస్టమ్స్ అధికారుల సోదాలు.. భారీగా బంగారం.. విదేశీ కరెన్సీ లభ్యం

By ETV Bharat Andhra Pradesh Team

Published : Oct 21, 2023, 12:05 PM IST

thumbnail

Customs Officials Search in Vijayawada: విజయవాడ కస్టమ్స్ అధికారులు పలు చోట్ల సోదాలు నిర్వహించగా.. వారికి రెండు చోట్ల భారీగా విదేశీ నగదు, బంగారం లభ్యమయ్యాయి.   సుమారు 55 లక్షల విలువైన బంగారాన్ని.. మరో 16 లక్షల 63వేల విలువైన విదేశీ కరెన్సీని స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంలో 55 లక్షల విలువైన బంగారం.. 3లక్షల 53 వేల రూపాయల విదేశీ కరెన్సీని పట్టుకున్నట్లు అధికారులు తెలిపారు. విజయవాడ నుంచి నెల్లూరు వెళ్తున్న బస్సులో నుంచి 13లక్షల 10వేల రూపాయల విదేశీ కరెన్సీని.. కాజా టోల్‌గేట్‌ వద్ద అధికారులు పట్టుకున్నారు. గత రెండేళ్లలో విజయవాడ కస్టమ్స్ కమిషనరేట్ ఆధ్వర్యంలో.. 40 కోట్ల రూపాయలు విలువచేసే 70 కిలోలకు పైగా బంగారాన్ని జప్తు చేసినట్లు అధికారులు పేర్కొన్నారు.

కృష్ణాజిల్లా నాగాయలంక తహసీల్దార్ కార్యాలయంలో లంచం తీసుకుంటూ ఆర్​ఐ పట్టుబడ్డారు.  మండలంలోని మర్రిపాలెం గ్రామానికి చెందిన ఓ వ్యక్తి  ఫ్యామిలీ నెంబర్ సర్టిఫికేట్ కోసం కార్యాలయానికి రాగా.. అతడి నుంచి ఆర్​ఐ 4,500 రూపాయలు లంచం డిమాండ్​ చేశాడు. దీంతో బాధితుడి ఫిర్యాదు మేరకు పక్క ప్రణాళికతో ఏసీబీ అధికారులు ఏసీబీ అధికారులు దాడి చేసి రెడ్​ హ్యండెడ్​గా పట్టుకున్నారు. 

TAGGED:

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.