CM Jagan Tour on Delhi for Two Days: నేడు దిల్లీ వెళ్లనున్న సీఎం జగన్.. మోదీతో భేటీ

By ETV Bharat Andhra Pradesh Team

Published : Oct 5, 2023, 8:26 AM IST

thumbnail

CM Jagan Tour on Delhi for Two Days: ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేడు, రేపు దిల్లీలో పర్యటించనున్నారు. ఉదయం 10 గంటలకు విజయవాడ నుంచి దిల్లీ బయల్దేరి వెళ్లనున్న సీఎం రెండు రోజుల పాటు అక్కడే తన అధికారిక నివాసంలో బస చేయనున్నారు. 6వ తేదీ ఉదయం 10 గంటలకు దిల్లీ లోని విజ్ఞాన్ భవన్​లో కేంద్ర ప్రభుత్వం నిర్వహించే వామపక్ష తీవ్రవాద ప్రభావిత రాష్ట్రాల కాన్ఫరెన్సుకు సీఎం జగన్ హాజరు కానున్నారు. మరోవైపు అపాయింట్‌మెంట్​ మెంట్ ఖరారు అయితే ఈ రోజు సాయంత్రం కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో సీఎం జగన్ భేటీ అయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. అటు ఆ తరువాత రోజు సాయంత్రం ప్రధాని మోదీతోనూ సీఎం భేటీ అవుతారని సమాచారం. గతంలో జగన్ అనేక మార్లు దిల్లీ వెళ్లి మోదీతో బేటీ అయ్యారు. జగన్ దిల్లీ పర్యటన రాష్ట్ర ప్రయోజనాల కంటే సొంత ప్రయోజనాల కోసమే కలుస్తురనే ఆరోపణల నేపథ్యంలో ఈ దిల్లీ టూర్​ను ప్రతిపక్షాలు ఆసక్తిగా గమనిస్తున్నాయి. 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.