New 108 Ambulances: కొత్తగా మరో 146 అంబులెన్స్​లు.. ప్రారంభించిన సీఎం జగన్

By

Published : Jul 3, 2023, 5:39 PM IST

thumbnail

AP CM Jagan: రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా 146 అంబులెన్స్​లను అందుబాటులోకి తీసుకువచ్చింది. గత కొంత కాలంగా  కాలం చెల్లిన 108 అంబులెన్స్​లతో నెట్టుకొస్తున్న ప్రభుత్వం ఎట్టకేలకు 146 కొత్త అంబులెన్స్​లను రోడ్డుపైకి తీసుకువచ్చింది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న 108 అంబులెన్స్​లకు అదనంగా మరో 146 కొత్త అంబులెన్స్​లను అందుబాటులోకి తీసుకువచ్చినట్లు అధికారులు తెలిపారు. సీఎం జగన్ తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో జెండా ఊపి అంబులెన్స్​లను ప్రారంభించారు.  ఈ కార్యక్రమంలో  వైద్యఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని, ఉషాశ్రీ చరణ్​తో పాటుగా పలువురు నాయకులు, అధికారులు  పాల్గొన్నారు. మెుత్తం రూ. 34.79 కోట్లతో 146 అంబులెన్స్​లను రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల కొనుగోలు చేసింది. కొత్త అంబులెన్సుల చేరికతో రాష్ట్రంలో ప్రస్తుతం 768 అంబులెన్స్​లు అందుబాటులోకి వస్తాయని అధికారులు పేర్కొన్నారు. ఇవీ మెుత్తంగా  705 సెగ్మెంట్లను కవర్‌ చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. 676 మండల సెగ్మెంట్లు, 29 అర్బన్‌ సెగ్మెంట్లలో అంబులెన్స్​లు సేవలందిస్తున్నట్లు వెల్లడించారు.  

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.