'పాఠశాలలా? పార్టీ కార్యాలయాలా?' విద్యార్థులంతా జగన్​కు జై కొట్టాల్సిందేనన్న వైఎస్సార్సీపీ నేతలు

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 21, 2023, 5:09 PM IST

thumbnail

CM Jagan Birthday Celebrations in Schools : వైఎస్సార్సీపీ నాయకులు అత్యుత్సాహాన్ని ప్రదర్శించి పాఠశాలలను రాజకీయ వేదికలుగా మార్చడం చర్చనీయాంశంగా మారింది. ఆ పార్టీ నేతలకు సీఎం జగన్​పై ఉన్న పిచ్చి అభిమానానికి అభం శుభం తెలియని విద్యార్థులు సతమతం అయ్యారు. పూర్తి వివరాల్లోకి వెళితే,

నేడు సీఎం జగన్ పుట్టిన రోజు కావడంతో అధిష్టానం మెప్పు పొందడం కోసం వైఎస్సార్సీపీ నేతలు మితిమీరి ప్రవర్తిస్తున్నారు. ఏకంగా జగన్ జన్మదినం సందర్భంగా కడప ఉర్దూ పాఠశాలలో జగన్‌ పుట్టినరోజు సందర్భంగా కేక్ కట్‌ చేసి సంబరాలు షురూ చేశారు. అనంతరం బహుమతులు పంచారు. జిల్లా వ్యాప్తంగా కొన్ని పాఠశాలల్లో ఏకంగా పిల్లల చేతికి పార్టీ జెండాలు ఇచ్చి జగన్ జై కొట్టాలని హుకూం జారీ చేశారు. ఏమీ చేయాలో తెలియని విద్యార్థులు బిక్కు బిక్కుమంటూ థాంక్యూ జగన్ మామయ్య, జై జగన్ అంటూ నినాదాలు చేశారు. ఈ నిర్వాకాన్ని ఉపాధ్యాయులు, ఉన్నతాధికారులు అడ్డుకోకపోవడం విస్మయం కలిగిస్తుంది.

పాఠశాలల్లో జగన్ పుట్టిన రోజు వేడుకలు జరుపుకోవడంపై విద్యార్థుల తల్లిదండ్రులు విమర్శిస్తున్నారు. విద్యార్థులను కార్యకర్తలుగా మార్చడంపై పలు ప్రజా సంఘ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు.  వైఎస్సార్సీపీ నాయకుల చేష్టలు రోజురోజుకూ మితిమీరిపోతున్నాయని, చివరకు జన్మదిన వేడుకలను పాఠశాలలో జరుపుకొనే స్థాయికి దిగజారిపోయారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలలను కూడా పార్టీ కార్యాలయాలుగా మార్చుకోవడంపై విద్యార్థుల తల్లిదండ్రులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.