Cheetah Migration in Vizag: విశాఖ శివారులో చిరుత పులి కలకలం.. భయాందోళనలో జనం

By ETV Bharat Andhra Pradesh Team

Published : Aug 25, 2023, 6:16 PM IST

thumbnail

Cheetah Migration in Vizag: అడవులు క్షీణించడం వల్ల అక్కడ నివసించే జంతువులు జనావాసాల్లోకి రావడం మనం తరుచూ చూస్తుంటాం. అలాంటి ఓ సంఘటనే విశాఖ నగర శివారు ప్రాంతమైన ఎండాడలో జరిగింది. ఎండాడలోని ఎంకే గోల్డ్ వద్ద చిరుత కనిపించటం స్థానికంగా ఉండే ప్రజల్లో కలకలం రేపింది. ఎంకే గోల్డ్​కి సమీపంలో ఉన్న ఓ అపార్ట్​మెంట్​లో పనిచేసే ఓ సెక్యూరిటీ గార్డు.. తాను భోజనం చేసే సమయంలో ఆ పక్కన ఉన్న కొండ మీద నుంచి ఓ జంతువు రావడం గమనించానని తెలిపాడు. మొదట తాను ఆ జంతువు కుక్క అని అనుకున్నానని అతను పేర్కొన్నాడు. కానీ దగ్గరికి సమీపిస్తున్న కొద్ది అది చిరుతపులి అని తెలుసుకుని భయాందోళనకు గురైనట్లు తెలిపాడు. వెంటనే అప్రమత్తమైన ఆ సెక్యూరిటీ గార్డు.. చిరుతపులిని చూసిన విషయం గురించి స్థానికులకు తెలియజేశాడు. చిరుత సంచారంపై స్థానికులు అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. చిరుత పులి కోసం అటవీ అధికారులు తనిఖీ చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.