నాలుగేళ్లలో 8సార్లు విద్యుత్​ ఛార్జీల పెంపు - పేదల నడ్డి విరుస్తున్న జగన్​ ప్రభుత్వం : బీజేపీ

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 21, 2023, 5:45 PM IST

thumbnail

BJP Protests Against Hike in Electricity Charges : విద్యుత్​ ఛార్జీలు పెంపుతో వైసీపీ ప్రభుత్వం పేద ప్రజల నడ్డి విరుస్తోందని బీజేపీ నాయకులు ఆరోపించారు. విద్యుత్​ ఛార్జీల పెంపును నిరసిస్తూ తిరుపతి ఏపీఎస్పీడీసీఎల్​ కేంద్ర కార్యాలయం ఎదుట బీజేపీ నాయకులు బైఠాయించారు. విద్యుత్​ ఛార్జీల పెంచనని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చెప్పిన జగన్​ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎనిమిది సార్లు పెంచారని ఆరోపించారు. ఇప్పటి వరకు పెంచిన విద్యుత్​ ఛార్జీలను తగ్గించకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలను చేస్తామని హెచ్చరించారు.

Jagan's Government Cheated People : మాట తప్పను మడమ తిప్పను అని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చెప్పిన జగన్​ అధికారంలోకి రాగానే ఇచ్చిన హామీలను గాలికి వదిలేశారని బీజేపీ నాయకులు విమర్శించారు. విద్యుత్​ ఛార్జీలు పెంపుతో జగన్​ ప్రజలకు షాక్​ ఇస్తే, రానున్న ఎన్నికల్లో ప్రజలు జగన్​కు షాక్​ ఇస్తారని తెలిపారు. పరిపాలన ముందుచూపు లేకపోవడం వల్లనే ప్రస్తుతం రాష్ట్రంలో బొగ్గు నిల్వలు తగ్గిపోయాయని వ్యాఖ్యానించారు. ఇప్పటి వరకు పెంచిన విద్యుత్​ ఛార్జీలను వెంటనే తగ్గించాలని డిమాండ్​ చేశారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.