Tension at Tadikonda PS: దళిత యువకులపై దాడి.. తాడికొండ పోలీస్​స్టేషన్​ వద్ద ఉద్రిక్తత

By

Published : Jun 23, 2023, 5:33 PM IST

thumbnail

Tension at Tadikonda Police Station: గుంటూరు జిల్లా తాడికొండ పోలీస్​స్టేషన్ వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు గోళ్ల అరుణ్ కుమార్ స్థానిక మాల నాయకులతో కలిసి పోలీస్​స్టేషన్ వద్ద ప్రధాన రహదారిపై ధర్నా చేశారు. గురువారం రాత్రి తాడికొండ మండలం కంతేరు గ్రామంలో దళిత యువకులపై అదే గ్రామానికి చెందిన ఒక సామాజిక వర్గానికి చెందినవారు దాడి చేశారని అరుణ్​కుమార్​ తెలిపారు. దాడిలో ముగ్గురు దళిత యువకులకు తీవ్ర గాయాలయ్యాయని వివరించారు. అందులో శామ్యూల్​ అనే యువకుడిని కారు​లో బలవంతంగా ఎక్కించి.. దారిలో అతనిపై చేతులతో దాడి చేస్తూ పోలీస్ స్టేషన్ వద్ద విడిచి పెట్టారని ఆరోపించారు. ఈ సంఘటనపై పోలీసులు ఇప్పటి వరకూ కేసు నమోదు చేయలేదని మండిపడ్డారు. దళితులకు న్యాయం జరిగే వరకు ఊరుకోమని తేల్చిచెప్పారు. దళితులపై ఇంత దారుణంగా దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తమకు న్యాయం జరిగే వరకూ పోలీస్​స్టేషన్ ముందు రోడ్డుపై కూర్చొని నిరసన తెలుపుతామని అరుణ్ కుమార్ స్పష్టం చేశారు.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.