Workers Agitation: డిమాండ్ల సాధనకై.. మున్సిపల్​ ఆఫీస్​ గేటుకు తాళం వేసిన కార్మికులు

By

Published : Jul 27, 2023, 5:41 PM IST

thumbnail

Municipal Workers Protest In Anantapur: అనంతపురం నగరపాలక సంస్థలో పని చేసే పారిశుద్ధ్య కార్మికులు కన్నెర్ర చేశారు. తమ డిమాండ్లను పరిష్కరించాలంటూ అనంతపురం నగర పాలక సంస్థ కార్యాలయాన్ని ముట్టడించారు. అధిక సంఖ్యలో మున్సిపల్​ ఆఫీస్​కు​​ చేరుకున్న​ కార్మికులు.. నగర పాలక సంస్థ​ కార్యాలయంలోనికి వెళ్లే గేటుకు తాళం వేశారు. కార్యాలయం ఎదుట బైఠాయించి.. అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసనకు దిగారు. మున్సిపల్​ కార్మికులకు రావాలసిన పీఎఫ్ బకాయిలను అధికారులు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు హెల్త్ అలవెన్స్ ఇవ్వాలని మున్సిపల్ కార్మికులు డిమాండ్​ చేశారు. కార్మికులందరికీ సమాన వేతనం ఇవ్వాలని కోరారు. అలాగే తమ ఉద్యోగాలను రెగ్యులరైజ్ చేయాలని కార్మికులు డిమాండ్​ చేశారు. తమ డిమాండ్లు పరిష్కరించకపోతే సమ్మె చేయడానికి కూడా సిద్ధమని మున్సిపల్​ కార్మికులు హెచ్చరించారు. తమను శాశ్వత ఉద్యోగులుగా గుర్తించకపోతే.. వచ్చే ఎన్నికల్లో జగన్​కు ఓటు వేసే ప్రసక్తే లేదని ఓ కార్మికురాలు స్పష్టం చేసింది. 

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.