ఫిర్యాదును పట్టించుకోలేదని యువకుడు హల్​చల్ - కిరోసిన్ డబ్బాతో కలెక్టర్ కార్యాలయంపైకి

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 27, 2023, 3:17 PM IST

thumbnail

A Man Committed Suicide by Climbing Up the Collector's Office : తనకు న్యాయం చేయాలని కోరుతూ ఓయువకుడు ప్రకాశం జిల్లా కలెక్టరు కార్యాలయం పైకెక్కి హల్​చల్​ చేశాడు. ఉమ్మడి ప్రకాశం జిల్లా చినగంజాంకు చెందిన మార్క్ బెన్నీ.. భూముల విషయంలో ఓ నాయకుడు అన్యాయం చేశాడని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కారణం వల్ల తన సోదరి హత్యకు గురైందని తెలియజేశారు. 

ఈ విషయంలో పరిహారం రావాల్సి ఉందని పేర్కొన్నారు. దీనిపై జిల్లా కలెక్టర్​కు, పోలీసులకు ఎన్ని సార్లు ఫిర్యాదు చేసినా.. ఫలితం లేదని ఆరోపించారు. ఈ కారణంతో మనస్థాపానికి గురై తను.. కిరోసిన్ బాటిల్​తో కలెక్టరు కార్యాలయం పైకి.. ఆత్మహత్య చేసుకుంటానని అక్కడ ఉన్న వారికి తెలిపారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు.. కలెక్టరేట్​ వద్దకు చేరుకున్నారు. కొంతమంది యువకుల సహకారంతో పోలీసులు.. అతడిని చాకచాక్యంతో కిందకు దించారు. అనంతరం బెన్నీని అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.