ETV Bharat / state

ప్రేమించానని దగ్గరయ్యాడు... పెళ్లి చేసుకోమని అడిగితే ముఖం చాటేశాడు!

author img

By

Published : May 1, 2021, 10:40 PM IST

woman giving compalint on young man at kadapa
యువకుడిపై మహిళ ఫిర్యాదు

ఏడాదిన్నర పాటు ప్రేమించాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. శారీరకంగా దగ్గరయ్యాడు. ఇప్పుడు పెళ్లి చేసుకోమని అడిగితే ముఖం చాటేశాడు. ఫలితంగా బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. ఈ ఘటన కడపలో జరిగింది.

కడప నగరంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో ఓ మహిళ నర్సుగా పనిచేస్తోంది. ఆమెకు నెల్లూరు జిల్లాకు చెందిన రాజశేఖర్ రెడ్డి అనే వ్యక్తితో పరియయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారింది. ఈ క్రమంలో రాజశేఖర్ రెడ్డి ఆ మహిళ చేసుకుంటానని నమ్మించి, కొంతకాలం సహజీవనం చేశాడు.

బాధితురాలు పెళ్లి చేసుకోవాలని అడగ్గానే ముఖం చాటేశాడు. దీంతో చేసేదేమీ లేక బాధిత మహిళ పోలీసులను ఆశ్రయించింది. ఫిర్యాదు నమోదు చేసుకున్న పోలీసులు రాజశేఖర్ రెడ్డిపై అత్యాచారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చదవండి:

10 మంది కొవిడ్ రోగుల మృతి.. ఆక్సిజన్ అందకపోటమే కారణమా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.