ETV Bharat / state

కడప నడిబొడ్డున కత్తిపోట్లు.. ఇద్దరు యువకుల దారుణ హత్య

author img

By

Published : Feb 2, 2023, 11:46 AM IST

ఇద్దరు యువకుల దారుణ హత్య
ఇద్దరు యువకుల దారుణ హత్య

murder in kadapa district: కడపలో ఇద్దరు యువకుల హత్యోదంతం స్థానికంగా చర్చనీయాంశమైంది. రాత్రి వేళ బార్ నుంచి వెళ్లిపోతున్న యువకుడిపై ప్రత్యర్థులు కత్తులతో దాడి చేశారు. అతడు అక్కడికక్కడే మృతి చెందగా.. అడ్డుకునేందుకు యత్నించి స్నేహితుడు కూడా కత్తిపోట్లకు గురై చికిత్స పొందుతూ ఆస్పత్రిలో మృతి చెందాడు.

murder in kadapa district : కడప నగర నడిబొడ్డున జన సంచారం రద్దీగా ఉండే ప్రాంతంలో ఇద్దరు యువకులు హత్యకు గురయ్యారు. ఈ ఘటన జిల్లా వ్యాప్తంగా సంచలన రేకెత్తించింది. కొంతకాలం నుంచి ప్రశాంతంగా ఉన్న కడపలో ఒక్కసారి ఇద్దరు యువకులు హత్యకు గురి కావడం చర్చనీయాంశంగా మారగా.. మరోవైపు . పోలీసులపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. హత్యకు గురైన వారు, హత్యకు పాల్పడిన వారి పై గతంలో పోలీస్ స్టేషన్లో చాలా కేసులు నమోదై ఉన్నాయి.

కడప రాజారెడ్డి వీధికి చెందిన రేవంత్, సీయోను పురానికి చెందిన అభిలాష్ ఇద్దరూ స్నేహితులు. రేవంత్ జులాయిగా తిరిగేవాడు. అభిలాష్ తండ్రి ఇటీవల చనిపోవడంతో తండ్రి ఉద్యోగం అతడికి ఇచ్చారు. రేవంత్ పై గతంలో కడపలోని పలు స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. గతంలో రేవంత్ వేరే వారితో గొడవలు పెట్టుకోవడంతో పాత కక్షలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో రేవంత్, అభిలాష్ నిన్న రాత్రి సాయిబాబా థియేటర్ సమీపంలోని బార్ కు వచ్చారు.

రేవంత్ మద్యం తాగి బయటికి వస్తుండగా అతని కోసం కాపు కాసి ఉన్న కడప నగరానికి చెందిన మరో నలుగురు కత్తులతో దాడి చేశారు. రేవంత్ ను విచక్షణ రహితంగా పొడవడంతో తీవ్ర రక్తస్రావమై అక్కడికక్కడే మృతి చెందాడు. అడ్డువచ్చిన అభిలాష్ ను కూడా కత్తితో పొడిచారు. తీవ్ర గాయాలు కావడంతో చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం తిరుపతికి తీసుకెళ్తుండగా గురువారం తెల్లవారుజామున రెండు గంటలకు మృతి చెందాడు.

జంట హత్యలతో కడప నగరం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. జనసంచారం ఉన్నచోట ఇద్దరిని హత్య చేయడం పోలీసులకు సవాల్ గా మారింది. హత్య చేసిన వారికోసం ప్రత్యేక పోలీస్ బృందాలు గాలిస్తున్నాయి.

ఇవీ చదవండి :

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.