ETV Bharat / state

Missing: అన్నమయ్య జలాశయానికి పెరిగిన ఉధృతి...40 మంది గల్లంతు!

author img

By

Published : Nov 19, 2021, 11:56 AM IST

Updated : Nov 19, 2021, 1:19 PM IST

40 మంది గల్లంతు!
40 మంది గల్లంతు!

రాజంపేట వద్ద అన్నమయ్య జలాశయం వరద ఉద్ధృతి భయానకంగా ఉంది. ప్రాజెక్టు వద్ద వరద ప్రవాహం పోటెత్తుతూనే ఉంది. జలాశయం ఎర్త్‌ బండ్‌ వద్ద పూర్తిగా కొట్టుకుపోయింది. జలాశయ పరివాహక గ్రామాలను వరద ముంచెత్తింది. గుండ్లూరు, శేషమాంబపురం, మందపల్లి గ్రామాలు నీటమునిగాయి. సుమారు 30 నుంచి 40 మంది గల్లంతయ్యారని అధికారుల అంచనావేస్తున్నారు.

40 మంది గల్లంతు!

నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో.. కడప జిల్లాలో వర్షాలు కుంభవృష్టిని తలపిస్తున్నాయి. జిల్లాలోని జలాశయాలు నిండుకుండలుగా మారాయి. రాజంపేట వద్ద అన్నమయ్య జలాశయం వరద ఉద్ధృతి భయానకంగా ఉంది. ప్రాజెక్టు వద్ద వరద ప్రవాహం పోటెత్తుతూనే ఉంది. జలాశయం ఎర్త్‌ బండ్‌ వద్ద పూర్తిగా కొట్టుకుపోయింది. జలాశయ పరివాహక గ్రామాలను వరద ముంచెత్తింది. గుండ్లూరు, శేషమాంబపురం, మందపల్లి గ్రామాలు నీటమునిగాయి. సుమారు 30 నుంచి 40 మంది గల్లంతయ్యారని అధికారుల అంచనావేస్తున్నారు. అలాగే చెయ్యేరు నదిలో 16 మంది గల్లంతయ్యారు. అలాగే రాజంపేట మండలం బాదనగడ్డపై వరద ప్రవాహం. నందలూరు-రాజంపేట మధ్య రైల్వేట్రాక్‌ కొట్టుకుపోయింది. దీనివల్ల రైళ్ల రాకపోకలు స్తంభించాయి. నందలూరు వద్ద మూడు మృతదేహాలను వెలికితీశారు.

ఇదీ చదవండి:

HEAVY RAINS: భారీ వర్షాలతో అనంత అతలాకుతలం..నీట మునిగిన పంటలు

Last Updated :Nov 19, 2021, 1:19 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.