Dead Body: దారుణం.. తండ్రి మృతదేహాన్ని ఘాట్​రోడ్​లో విసిరేసిన కుమారుడు

author img

By

Published : May 2, 2023, 10:44 PM IST

Updated : May 3, 2023, 6:19 AM IST

v

Father Dead Body: పున్నామ నరకం నుంచి రక్షించే వాడు పుత్రుడు అంటారు. కానీ ఇక్కడ తండ్రి చనిపోయినా.. అంత్యక్రియలు చేసి తన రుణం తీర్చుకోకుండా అంత్యక్రియలు చేసేందుకు ఆర్థిక స్తోమత లేక నిర్లక్ష్యంతో రోడ్డు మీద పడేసి వెళ్లాడు. కొన్ని రోజుల తర్వాత దుర్వాసన రావండంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఇక అసలు విషయం తెలుసుకున్న పోలీసులు చివరికి అతనిపై సీనియర్ సిటిజన్ యాక్ట్ ప్రకారం కేసు నమోదు చేసి జైలుకు పంపించిన ఘటన కడపలో చోటు చేసుకుంది.

Father Dead Body: రక్తసంబంధీకులు చనిపోతే భుజాలపై మోసుకెళ్లడం, ద్విచక్ర వాహనాలపై తీసుకెళ్లడం లాంటి ఎన్నో ఘటనలు చూశాం. అయినవారి అంత్యక్రియలు ఘనంగా చేయాలని ప్రతి ఒక్కరూ భావిస్తుంటారు. కానీ ఇక్కడ మాత్రం పూర్తి భిన్నంగా జరిగింది. ఓ తనయుడు తండ్రి మృతదేహాన్ని తీసుకెళ్లి అంత్యక్రియలు చేయలేక.. ఘాట్ రోడ్​లో పడేసి చేతులు దులుపుకున్నాడు.

ఆర్థిక స్తోమత లేక: వైయస్సార్ జిల్లా దువ్వూరు మండలానికి చెందిన రాజశేఖర్ రెడ్డి క్లీనర్​గా పని చేస్తున్నాడు. అతని తండ్రి చిన్న పుల్లారెడ్డి గత కొంత కాలం నుంచి క్షయ వ్యాధితో బాధపడుతున్నాడు. కొడుకు నిర్లక్ష్యం చేయడంతో వ్యాధి ఎక్కువైంది. దీంతో తండ్రిని కడప ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో చేర్పించాడు. ఆసుపత్రిలో చేర్పించినప్పటికీ కొడుకు తండ్రిని పట్టించుకోలేదు. ఆస్పత్రి నిర్వాహకులు ఫోన్ చేసి మీ తండ్రి ఆరోగ్యం క్షీణించిందని చెప్పడంతో ఫిబ్రవరి 23వ తేదీ ఆస్పత్రికి వెళ్లి తన తండ్రిని డిశ్చార్జ్ చేసి తీసుకెళ్తుండగా మార్గమధ్యంలోనే మృతి చెందాడు. తండ్రి మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకెళ్లేందుకు, అంత్యక్రియలు చేసేందుకు ఆర్థిక స్తోమత లేకపోవడంతో తండ్రి మృతదేహాన్ని నిర్లక్ష్యంగా గువ్వల చెరువు ఘాట్ రోడ్​లో పడేసి వెళ్లాడు. దాదాపు రెండు నెలల అనంతరం ఏప్రిల్ 29వ తేదీ ఘాట్ రోడ్​లో దుర్వాసన రావడంతో స్థానికులు గుర్తించి విషయాన్ని చింతకొమ్మదిన్నె పోలీసులకు తెలియజేశారు.

సీనియర్ సిటిజన్ యాక్ట్: పోలీసులు వెళ్లి మృతదేహాన్ని పరిశీలించగా అప్పటికే గుర్తుపట్టలేని విధంగా మారింది. మృతదేహానికి చుట్టిన దుప్పటి ఆధారంగా పోలీసులు విచారణ చేపట్టగా.. కొడుకే తండ్రి మృతదేహాన్ని పడేసి వెళ్లినట్లు తెలిసింది. పోలీసులు రాజశేఖర్ రెడ్డిపై సీనియర్ సిటిజన్ యాక్ట్ ప్రకారం కేసు నమోదు చేసి రిమాండ్​కు తరలించారు. ఎవరైనా తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేసిన, పోషించకుండా ఉండిన, ఇంట్లో నుంచి బయటికి పంపించిన వారిపై సీనియర్ సిటిజన్ యాక్ట్ ప్రకారం కేసు నమోదు చేస్తామని డీఎస్పీ షరీఫ్ స్పష్టం చేశారు. ఎవరైనా అంత్యక్రియలు చేయలేని దుస్థితిలో ఉంటే పోలీసులకు సమాచారం ఇవ్వాలని పేర్కొన్నారు.

కేసు వివరాలు వెల్లడిస్తున్న పోలీసులు

రాజశేఖర్ రెడ్డి అనే కొడుకు తన ఆర్థిక పరిస్థితి బాగాలేక అంత్యక్రియలు నిర్వహించలేనని.. తన తండ్రి అయిన చిన్న పుల్లారెడ్డి మృతదేహాన్ని చెరువు ఘాట్ రోడ్ లో పడేశాడు. దాదాపు రెండు నెలలు తర్వాత దుర్వాసన వస్తోందని స్థానికులు మాకు తెలియజేశారు. మృత దేహం వద్ద ఉన్న ఆధారాలను పరిశీలించి రాజశేఖర్ రెడ్డి చిరునామా కనుక్కున్నాము. అనంతరం అతను తన ఆర్థిక పరిస్థితి బాగాలేక అంత్యక్రియలు నిర్వహించలేదని చెప్పడం జరిగింది. కానీ, తల్లిదండ్రులను పట్టించుకోకపోవడం తప్పు కాబట్టి సీనియర్ సిటిజన్ యాక్ట్ కింద రాజశేఖర్ రెడ్డిపై కేసు నమోదు చేయడం జరిగింది.-షరీఫ్, డీఎస్పీ

ఇవీ చదవండి:

Last Updated :May 3, 2023, 6:19 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.