Akbar Basha: అక్బర్ బాషా భూమిని వారికి తిరిగి ఇచ్చేయండి: తెదేపా

author img

By

Published : Sep 21, 2021, 3:38 PM IST

Akbar Basha

పొలం విషయంలో న్యాయం జరిగేలా లేదని ఆత్యహత్యాయత్నానికి పాల్పడిన అక్బర్ బాషా కుటుంబాన్ని కడప జిల్లా ప్రొద్దుటూరులో తెదేపా నేతలు రామర్శించారు. ఆ కుటుంబానికి న్యాయం చేయాలని.. వారి భూమిని వారికి తిరిగి ఇచ్చేయాలని డిమాండ్ చేశారు.

పొలం విషయంలో న్యాయం జరిగేలా లేదని ఆత్యహత్యాయత్నానికి పాల్పడిన అక్బర్ బాషా కుటుంబాన్ని తెదేపా నేతలు పరామర్శించారు. కడప జిల్లా ప్రొద్దుటూరులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న అక్బర్ కుటుంబాన్ని తెదేపా కడప పార్లమెంట్ అధ్యక్షుడు లింగారెడ్డి, రెడ్యం వెంకటసుబ్బారెడ్డి, ప్రొద్దుటూరు నియోజకవర్గ ఇన్​చార్జిప్రవీణ్ కుమార్​రెడ్డిలు పరామర్శించి ధైర్యం చెప్పారు.

రాష్ట్రంలో మైనారిటీలపై దాడులు జరుగుతూనే ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్బర్ కుటుంబం మాట్లాడలేని పరిస్థితిలో ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ కుటుంబానికి న్యాయం చేయాలని.. వారి భూమిని వారికి తిరిగి ఇచ్చేయాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి సొంత జిల్లాలోనే ఇలా ఉంటే.. రాష్ట్రంలో మిగిలిన చోట్ల మైనార్టీల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు.

ఇదీ చదవండి : AKBER BASHA: 'భూమి ఇస్తామన్నారు.. రాజీ కుదుర్చుకున్నాం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.