ETV Bharat / state

పులివెందులలో పర్యటించిన కడప ఎంపీ అవినాష్ రెడ్డి

author img

By

Published : Jul 29, 2020, 1:04 AM IST

kadapa-mp-avinash-reddy-visited-pulivendula-constituency
పులివెందులలో పర్యటించిన కడప ఎంపీ అవినాష్ రెడ్డి

కడప జిల్లా పులివెందులో కడప ఎంపీ పర్యటించారు. నియోజకవర్గంలోని పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు.

కడప జిల్లా పులివెందుల నియోజకవర్గంలో... కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి పర్యటించారు. దాదాపు రూ. 64 కోట్లతో నిర్మిస్తున్న వివిధ భవనాలకు శంకుస్థాపనలు చేశారు. అందులో భాగంగానే చక్రాయపేట మండలంలో జూనియర్ కళాశాల భవనం, గండి గురుకుల పాఠశాలలో వసతి భవనాలు, జెడ్పీ బాలుర పాఠశాల, రైతు భరోసా గోడౌన్ భవనాలకు శంకుస్థాపన చేశారు.

వేంపల్లి మండలంలో రూ.24.80 కోట్ల వ్యయంతో జెడ్పీ బాలుర, బాలికల నూతన పాఠశాల, రూ.1.20 కోట్లతో ఫైర్ స్టేషన్, రూ. 4.56 కోట్లతో నిర్మిస్తున్న ఉర్దూ మాధ్యమం జూనియర్ కళాశాల, రూ.7.39 కోట్లతో పాలిటెక్నిక్ కళాశాలలోని అదనపు గదులు, రూ.1.72 కోట్లతో శిల్పారామం పార్క్​లకు శంకుస్థాపన చేశారు.

ఇదీచదవండి.

కోతులకు అంతిమ సంస్కారం.. గ్రామస్థుల ఔదార్యం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.