ETV Bharat / state

Thulasi reddy: 'సీఎం, వారి ఎంపీలు.. ప్రధాని కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టాలి'

author img

By

Published : Jul 5, 2021, 5:25 PM IST

తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న జల వివాదాలపై కాంగ్రెస్ నేత తులసిరెడ్డి (congress leader thulasi reddy) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వ ఉదాసీన వైఖరి వల్లే ఇరు రాష్ట్రాల మధ్య కృష్ణా జలాల(krishna water) గురించి తగాదాలు జరుగుతున్నాయని ఆక్షేపించారు. దివంగత నేత వైఎస్​.రాజశేఖర్(YS.Rajashekhar reddy) రెడ్డి గురించి తెలంగాణ మంత్రులు ఇష్టానుసారంగా మాట్లాడితే ఊరుకునేది లేదని హెచ్చరించారు.

కాంగ్రెస్ నేత తులసిరెడ్డి
కాంగ్రెస్ నేత తులసిరెడ్డి

కాంగ్రెస్ నేత తులసిరెడ్డి

తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న జల వివాదానికి కేంద్ర ప్రభుత్వ ఉదాసీన వైఖరే కారణమని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు తులసిరెడ్డి(thulasi reddy) ఆరోపించారు. రాష్ట్ర విభజన చట్టం ప్రకారం నీటి కేటాయింపుల విషయాన్ని తేల్చకుండా కేంద్రం వ్యవహరించడం వల్లే తగాదాలు ఏర్పడ్డాయని ఆయన ఆక్షేపించారు. తెలంగాణలో అక్రమ ప్రాజెక్టులు నిర్మిస్తూ రాయలసీమకు నీరు రాకుండా కేసీఆర్ అడ్డుపడుతుంటే... ఏపీ ముఖ్యమంత్రి జగన్ మెతక వైఖరి అవలంబిస్తున్నారని ఆరోపించారు.

నీటి కేటాయింపులు తేల్చుకోవాలంటే తక్షణమే ముఖ్యమంత్రి, వైకాపా ఎంపీలందరూ... దిల్లీ వెళ్లి ప్రధాని కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టాలని తులసిరెడ్డి డిమాండ్ చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి పాటుపడిన మాజీ ముఖ్యమంత్రి, దివంగత నేత వైఎస్​.రాజశేఖర్ రెడ్డి గురించి తెలంగాణ మంత్రులు ఇష్టానుసారంగా మాట్లాడితే ఊరుకునేది లేదని హెచ్చరించారు. రాయలసీమ ఎడారి కాకముందే రాష్ట్ర ప్రభుత్వం మేల్కోవాలని సూచించారు.

ఇదీ చదవండి:

Lokesh: 'నిరుద్యోగుల పోరాటానికి ముందుంటా'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.