ETV Bharat / state

Murder Case: ఆలయంలో పూజారి హత్య కేసు.. చంపిందెవరో తెలుసా?

author img

By

Published : Mar 26, 2022, 5:35 PM IST

Priest Murder Case: ఈనెల 21న పశ్చిమగోదావరి జిల్లా నిడదవోలు మండలం తాడిమళ్లలో జరిగిన ఆలయ పూజారి కొత్తలంక వెంకట నాగేశ్వరశర్మ హత్య కేసును పోలీసులు చేధించారు. ఈ హత్యకు సూత్రధారి ఎవరు అనే వివరాలను నిడదవోలు సీఐ వెంకటేశ్వరావు వెల్లడించారు.

Priest Murder Case
Priest Murder Case

పశ్చిమగోదావరి జిల్లా నిడదవోలు మండలం తాడిమళ్ల గ్రామ శివారులోని ఆలయ ఆవరణలో ఈనెల 21న జరిగిన ఆలయ పూజారి కొత్తలంక వెంకట నాగేశ్వరశర్మ హత్య కేసును పోలీసులు చేధించారు. ఆస్తి తగాదాల కారణంగా నాగేశ్వర శర్మ తమ్ముడి కుమారుడు కొత్తలంక వీరవెంకట సుబ్రహ్మణ్య సుమంత్‌ మరో నలుగురితో కలిసి ఈ హత్య చేసినట్లు విచారణలో వెల్లడైనట్లు సీఐ తెలిపారు. ఈ కేసులో ఐదుగురు నిందితులను అరెస్టు చేసినట్లు నిడదవోలు సీఐ తెలిపారు.

సర్కిల్‌ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో కేసు వివరాలను సీఐ వెల్లడించారు. 'మృతుడు పూజారి నాగేశ్వరశర్మ, అతని తమ్ముడి మధ్య చాలాకాలంగా ఆర్థిక విషయాల్లో తగాదాలున్నాయి. పలు పర్యాయాలు పెద్దల సమక్షంలో చర్చించినా పరిష్కారం కాలేదు. ఈ క్రమంలో తమ్ముడు కొడుకు పెదనాన్నపై కక్ష పెంచుకున్నాడు. పెదనాన్నను చంపేస్తే ఈ సమస్యకు పరిష్కారం దొరుకుతుందని భావించాడు.

దీంతో హత్యకు సుమంత్‌ పథకం రచించాడు. నలుగురితో కలిసి శివాలయంలో వెనుక నాగేశ్వర శర్మను హత్య చేశారు. కేసులో నిందితులు కొవ్వూరు మండలం వాడపల్లికి చెందిన హనుమంతరావు, ఆలపాటి రాఘవ, తూర్పుగోదావరి జిల్లా ఎల్చేరుకు చెందిన సురేశ్‌, విజ్యేశ్వరానికి చెందిన షేక్‌ పీర్‌ మజీన్‌ను అరెస్టు చేశాం' అని సీఐ చెప్పారు.

ఇదీ చదవండి:
శ్రీకాకుళంలో దారుణం.. నడిరోడ్డుపై వ్యక్తి హత్య

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.