ETV Bharat / state

పులి సంచారం.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అటవీశాఖ సూచన

author img

By

Published : Apr 27, 2022, 9:49 AM IST

TIGER: పులి పేరు చెబితినే చాలా మంది భయంతో వణికిపోతారు. అలాంటిది పులిని రోడ్డు మీద చూస్తే ప్రాణభయంతో పరుగులు పెడతారు. తాజాగా ఇలాంటి ఘటనే విజయనగరం జిల్లా ఎస్‌.కోట పరిసరాల్లో జరిగింది. సమీప ప్రాంతాల్లో పులి సంచారం గ్రామస్థులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది.
tiger roaming
విజయనగరం జిల్లా ఎస్.కోట పరిసరాల్లో పులి సంచారం

విజయనగరం జిల్లా ఎస్.కోట పరిసరాల్లో పులి సంచారం

TIGER: విజయనగరం జిల్లా ఎస్‌.కోట పరిసరాల్లో పులి సంచారం గ్రామస్థులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. ఎస్‌.కోటలోని జలగలబంద రహదారిపై పులిని చూసిన వాహనదారులు భయంతో వణికిపోతున్నారు. కృష్ణాపురం శివారు భీమవరంలో రెండు గొర్రెలపై పులి దాడి చేసినట్లు స్థానికులు అటవీ సిబ్బందికి సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న అటవీశాఖ అధికారులు పాదముద్రలు సేకరించి పులి దాడిని నిర్దారించారు. పరిసర గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పులి సంచారం గురించి పల్లెల్లో దండోరా వేయించారు.

ఇదీ చదవండి: 'ఏపీలో వ్యవసాయ రంగం సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.