ETV Bharat / state

నమ్మించి మోసం చేసిన ముగ్గురు మహిళలు..బాధితుల ఆందోళన

author img

By

Published : Dec 7, 2020, 6:49 PM IST

ఆత్మీయులే అని నమ్మి వారి వద్ద చిట్టీలు కడితే మోసం చేశారు. ముగ్గురు మహిళలు చేసిన ఈ దోపిడీలో 150 మంది స్థానికులు బలయ్యారు. తమ సొమ్ము తిరిగి ఇవ్వాలంటూ మహిళల ఇంటి ముందు బాధితులు ఆందోళనకు దిగారు.

three womens cheated
చిట్టీలతో వంఛించిన ముగ్గురు మహిళలు

విజయనగరం జిల్లా చీపురుపల్లి మండలం గులివిదాడ అగ్రహారంలో ముగ్గురు మహిళలు చిట్టీల పేరుతో పలువురిని మోసం చేశారు. స్థానికంగా ఉండే డాలర్​ భాగ్యలక్ష్మి, సంధ్య, రమ్య అనే మహిళలు తమ మాటలతో పరిసరాల్లో ఉండేవారిని నమ్మించి చిట్టీలు వేయించారు. 150 మంది గృహిణులు వారి వద్ద చిట్టీలు కట్టారు. కొద్ది రోజులకు సొమ్ము చెల్లించాలని బాధితులు అడగటంతో తమ దగ్గర లేవని చేతులు ఎత్తేశారు. మోసపోయామని తెలుసుకున్న బాధితులు, నిందితుల ఇంటి ఎదుట ఆందోళనకు దిగారు. సుమారు రూ.2 కోట్ల వరకు మోసం చేసినట్లు బాధితులు తెలిపారు.

ఇదీ చదవండీ...అడిషనల్ డీజీపీకి తప్పిన పెను ప్రమాదం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.