ETV Bharat / state

మాదక ద్రవ్యాలకు బానిస కావద్దని.. 'వైజాగ్​ మారథాన్​ 2022'

author img

By

Published : Dec 18, 2022, 11:06 AM IST

Vizag Marathon : మాదక ద్రవ్యాలకు బానిస కావద్దనే నినాదంతో విశాఖలో వైజాగ్​ మారథాన్​ కార్యక్రమాన్ని నిర్వహించారు. వైజాగ్​ మారథాన్​ 2022 పేరుతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో విశాఖ నగరవాసులు ఉత్సహంగా పాల్గొన్నారు.

vizag marthon 2022
విశాఖ మారథాన్​ 2022

Vizag Marathon 2022 : విశాఖ బీచ్‌లో 'వైజాగ్ మారథాన్-2022' కార్యక్రమం ఉత్సాహంగా సాగింది. ప్లాస్టిక్ నిర్మూలనతోపాటు, మాదక ద్రవ్యాలకు బానిస కావద్దనే నినాదాలతో వైజాగ్‌ రన్నర్స్‌ సొసైటీ ఆధ్వర్యంలో మారథాన్‌ నిర్వహించారు. 21 కే, 10 కే, 5 కే, 3 కే విభాగాల్లో నగరవాసులు ఈ మారథాన్​లో పాలు పంచుకున్నారు. వివిధ పాఠశాలల విద్యార్థులు నృత్యాలతో ఔత్సాహికులను ఉత్సాహపరిచారు.

విశాఖ బీచ్‌లో 'వైజాగ్ మారథాన్ 2022' కార్యక్రమం

"ఈ మారథాన్​లో విశాఖ నగరవాసులు పాల్గొన్నారు. విశాఖలోని విద్యార్థులూ పాల్గొన్నారు. మాదక ద్రవ్యాలకు బానిస కావద్దనే నినాదంతో ఈ మారథాన్​ నిర్వహించాము. విశాఖ నగర ప్రాముఖ్యతను చెప్పటానికీ ఈ మారథాన్​ తొడ్పాడుతుంది." -బి.కె.రాయ్‌ వైజాగ్‌ రన్నర్స్‌ సొసైటీ అధ్యక్షుడు

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.