ETV Bharat / state

తీగలవలస జలపాతంలో ముగ్గురు గల్లంతు

author img

By

Published : May 30, 2021, 5:37 PM IST

Updated : May 30, 2021, 8:34 PM IST

విశాఖ జిల్లా తీగలవలస జలపాతం సమీపంలో ముగ్గురు యువకులు గల్లంతయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. గల్లంతైన వారు సన్యాసిపాలెంకు చెెందిన వారిగా గుర్తించారు.

missing
missing

విశాఖ జిల్లా హుకుంపేట మండలం తీగలవలస జలపాతం సమీపంలో ముగ్గురు యువకులు గల్లంతయ్యారు. గుడ్డిగుమ్మి జలపాతం వద్ద ఫోటో షూట్​ చేద్దామని పది మంది యువకులు వెళ్లగా.. వారిలో ఒకరు ప్రమాదవశాత్తు జారి జలపాతంలో పడిపోయారు. అతన్ని రక్షించటానికి వెళ్లిన మరో ఇద్దరు యువకులు గల్లంతయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు, రెవెన్యూ సిబ్బంది.. వారికోసం గాలింపు చర్యలు చేపట్టారు. గల్లంతైన ముగ్గురు సన్యాసిపాలెంకు చెందిన నిరంజన్(19), నాగేంద్ర పడాల్(22), వినోద్ కుమార్ (25)లుగా గుర్తించారు.

ఇదీ చదవండి

సెలయేరు విషపూరితం: క్రమంగా కళ తప్పుతున్న మత్స్యగుండం!

Last Updated :May 30, 2021, 8:34 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.