ETV Bharat / state

జగన్ కుటుంబం 1000 కోట్ల భూ కుంభకోణానికి పాల్పడింది..బండారు సత్యనారాయణమూర్తి

author img

By

Published : Nov 7, 2022, 8:38 AM IST

Visakha lands: విశాఖ రేడియంట్ సంస్థకు కేటాయించిన భూముల ఒప్పందం వెనక భారీ కుంభకోణం చోటుచేసుకుందని తెలుగుదేశంపార్టీ నాయకులు మాజీమంత్రి బండారు సత్యనారాయణమూర్తి అన్నారు. దీని వెనుక జగన్ హస్తముందని ఆయన ఆరోపించారు.

Bandaru sathya narayana
Bandaru sathya narayana

తెలుగుదేశంపార్టీ నాయకులు బండారు సత్యనారాయణమూర్తి

Visakha lands: విశాఖలో రేడియంట్ సంస్థకు కేటాయించిన భూముల ఒప్పందం వెనక భారీ కుంభకోణం చోటుచేసుకుందని తెలుగుదేశం ఆరోపించింది. ఈ వ్యవహారంలో జగన్ కుటుంబ సభ్యులు 1000 కోట్ల భూ కుంభకోణానికి పాల్పడినట్లు మాజీమంత్రి బండారు సత్యనారాయణమూర్తి ఆరోపించారు. జగన్ పెదనాన్న కుమారుడు అనిల్ రెడ్డి, సీఎం సతీమణి భారతి ప్రోద్బలంతోనే అక్రమాలు జరిగినట్లు ఆయన విమర్శించారు. సీఎం కుటుంబ సభ్యులతోపాటు ఆ పార్టీ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి విలువైన రేడియంట్ భూములు లాగేసుకున్నారని బండారు ఆరోపించారు. ఆర్బిట్రేషన్ కోర్టు ఆదేశాల ప్రకారం రేడియంట్ సంస్థకు చెందిన రమేశ్ కుమార్ కు భూములు అప్పగించాల్సి ఉండగా..ఆయనతో వేమిరెడ్డి MOU కుదుర్చుకున్నారన్నారు. ఈ వ్యవహారంలో వెయ్యికోట్ల వరకు గోల్ మాల్ జరిగిందని తెలుగుదేశం నేతలు ఆరోపించారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.