ETV Bharat / state

సంక్రాంతి స్పెషల్​.. విశాఖ-సికింద్రాబాద్​ మధ్య ప్రత్యేక రైళ్లు

author img

By

Published : Jan 9, 2023, 9:02 PM IST

special trains
special trains

Special Trains for Sankranti: సంక్రాంతి పండగకు దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేసింది. ఇప్పటికే వివిధ మార్గాల్లో ఈ ప్రత్యేక రైళ్లు నడుస్తుండగా.. తాజాగా విశాఖ-సికింద్రాబాద్​ మధ్య ప్రత్యేక రైళ్లు నడపాలని నిర్ణయించింది. ఈనెల 11 నుంచి 17 వరకు ఈ రైళ్లు అందుబాటులో ఉంటాయని అధికారులు ప్రకటించారు.

Special Trains for Sankranti: సంక్రాంతి రద్దీ దృష్ట్యా ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్త చెప్పింది. ఇప్పటికే వివిధ మార్గాల్లో ప్రత్యేక రైళ్లు నడుపుతున్న ఎస్‌సీఆర్‌.. తాజాగా విశాఖ-సికింద్రాబాద్‌ మధ్య ప్రత్యేక రైళ్లను నడపడాలని నిర్ణయించింది. జనవరి 11 నుంచి 17 వరకు ఈ ప్రత్యేక రైళ్లు అందుబాటులో ఉంటాయి. జనవరి 11న రాత్రి 7.50 గంటలకు విశాఖలో బయలు దేరిన ప్రత్యేక రైలు(08505) మరుసటి రోజు ఉదయం 7.10కి సికింద్రాబాద్‌ చేరుకుంటుంది. జనవరి 11, 13, 16 తేదీల్లో ఈ రైలు అందుబాటులో ఉంటుంది. మరోవైపు జనవరి 12, 14, 17 తేదీల్లో సికింద్రాబాద్‌ నుంచి రాత్రి 7.40కి బయలుదేరిన ప్రత్యేక రైలు (08506) తర్వాతి రోజు ఉదయం 8.20కి విశాఖ చేరుకుంటుందని రైల్వే అధికారులు వెల్లడించారు. మంగళవారం ఉదయం 8 గంటలకు రిజర్వేషన్లు ప్రారంభమవుతాయని తెలిపారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.