Searching for colored stones in vishaka district విశాఖ జిల్లా జి.మాడుగుల మండలం గడుతూరు పంచాయతీ కూటికొండలు గ్రామ సమీప అటవీ ప్రాంతంలో రంగురాళ్ల తవ్వకాలు జోరుగా జరుగుతున్నాయి. పెద్ద గుంతలు తవ్వి రంగురాళ్ల కోసం అన్వేషిస్తున్నారు. వ్యాపారులు స్థానికంగానే తిష్ఠ వేసి తవ్వకాలను ప్రోత్సహిస్తున్నారు. ఇప్పటికే రూ.లక్షల్లో వ్యాపారం జరిగినట్లు సమాచారం. సెప్టెంబరు నుంచి ఇక్కడ తవ్వకాలు జరుగుతున్నాయని, అటవీశాఖ అధికారులకు సమాచారం అందించినా స్పందించడం లేదని కూటికొండలు గ్రామస్థులు తెలిపారు.
ఇదీ చదవండి: తిరుమల శ్రీవారి ఆలయ ఓఎస్డీ డాలర్ శేషాద్రి కన్నుమూత