ETV Bharat / state

Purandeshwari again fire Jagan Govt: రాష్ట్రంలో అరాచక, కక్ష్యపూరిత రాజకీయం నడుస్తోంది: దగ్గుబాటి పురందేశ్వరి

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 24, 2023, 3:03 PM IST

Purandeshwari again fire Jagan Govt ఆంధ్రప్రదేశ్‌లో అరాచక పాలన నడుస్తోందని.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి ధ్వజమెత్తారు. రాష్ట్రాన్ని, ప్రజలను కాపాడుకునేందుకు ప్రతి పార్టీ కార్యకర్త పని చేయాలని పిలుపునిచ్చారు.

Purandeshwari_Harsh_Comments_on_YSRCP_Govt
Purandeshwari_Harsh_Comments_on_YSRCP_Govt

Purandeshwari again fire Jagan Govt: రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాలనపై, ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రప్రసాద్‌పై.. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి ఘాటు వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో గత నాలుగేళ్లుగా అరాచక పాలన నడుస్తోందని ధ్వజమెత్తారు. తాజాగా కక్ష్యపూరిత రాజకీయాలకు తేరలేపారని మండిపడ్డారు. రానున్న రోజుల్లో రాష్ట్ర, ప్రజల భవిష్యత్తు కోసం బీజేపీ కార్యకర్తలు పని చేయాలని ఆమె పిలుపునిచ్చారు.

BJP Social Media Workers Meeting: విశాఖపట్నం జిల్లాలో ఆదివారం బీజేపీ సామాజిక మాధ్యమాల వాలంటీర్లతో సమావేశం జరిగింది. ఈ సమావేశానికి కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ, రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి, ఎంపీ జీవీఎల్ నరసింహరావుతో పాటు మరికొంతమంది పార్టీ ముఖ్య నేతలు హాజరయ్యారు. ఈ సందర్భంగా పురందేశ్వరి మాట్లాడుతూ.. రాష్ట్రంలో జరుగుతున్న తాజా పరిస్థితులపై కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ సమక్షంలో పదునైన వ్యాఖ్యలు చేశారు.

Purandeshwari Visited the Victims of Liver Cirrhosis: మద్యం, ఇతర అక్రమాలపై త్వరలోనే కేంద్ర హోం శాఖకు ఫిర్యాదు: పురందేశ్వరి

Purandeshwari Comments: ''భారతీయ జనతా పార్టీ.. రాష్ట్రంలోని ఆర్ధిక పరిస్దితులపై ప్రజలకు వాస్తవాలు చెబితే.. దానిని ఖండించడానికి వచ్చిన ఆర్దిక మంత్రి బుగ్గన అన్నీ అబద్దాలు చెప్పారు. వైసీపీ పాలనలో రాష్ట్రంలో అభివృద్ది లేదు. పరిశ్రమలు రావడం లేదు. పెట్టుబడుల మాటేలేదు. మన బిడ్డల భవిష్యత్తుకు ఉపాధి కరువైన పరిస్దితి ఈ రాష్ట్రంలో నెలకొంది. అనాటి రాష్ట్ర ప్రభుత్వం అభ్యర్ధన మేరకు.. కేంద్రం పోలవరం ప్రాజెక్ట్ పనులను రాష్ట్రానికి అప్పగిస్తే.. ఈ ప్రభుత్వం ఆ పనులను ఎక్కడ ఉంచిందో ప్రజలే గమనించాలలి.'' అని దగ్గుబాటి పురందేశ్వరి అన్నారు.

Purandeshwari on Chandrababu Arrest చంద్రబాబు నాయుడి అరెస్ట్‌ను.. బీజేపీ ఆపాదించడం సరికాదు: పురందేశ్వరి స్పందన

Purandeshwari on Minister Buganna Comments: అనంతరం రాష్ట్ర ఆర్ధిక పరిస్దితులపై అసెంబ్లీలో ఆర్దిక మంత్రి బుగ్గన చేసిన వ్యాఖ్యలపై పురందేశ్వరి తీవ్రంగా మండిపడ్డారు. బీజేపీ ప్రజలకు వాస్తవాలు చెబితే.. మంత్రి బుగ్గన అవాస్తవాలు చెప్పారని దుయ్యబట్టారు. వాస్తవాలను దాచేసి ప్రజలను మభ్యపెట్టడానికి ఆయన ప్రయత్నించారన్నారు. ప్రభుత్వ ఆస్తుల అమ్మకం, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పీఎఫ్ వాడేసిన విషయాలను బుగ్గన దాచేందుకు యత్నించారని ఆమె విమర్శించారు. అనంతరం నాణ్యతలేని మద్యంతో రాష్ట్ర ప్రజలతో ప్రభుత్వం ఆటలాడుకుంటోందని పురందేశ్వరి విమర్శించారు. క్షేత్రస్దాయిలో అందరికీ సమాచారం ఇవ్వడమే కాదు.. వారిని ప్రభావితం చేసే శక్తి సోషల్ మీడియాకి ఉందని ఆమె వివరించారు.

''మా నాన్న అప్పట్లో మహిళలకు ఆస్తి హక్కు ఇచ్చారు. ఇప్పుడు మోదీ వారికి సంపూర్ణ సాధికారిత కల్పించేందుకు 33శాతం రిజర్వేషన్లు చట్టం చేశారు. అటువంటి నాయకత్వంలో నేను పని చేస్తున్నందుకు చాలా ఆనంద పడుతున్నాను. రాష్ట్ర అభివృద్ధి, ప్రజల క్షేమమే బీజేపీ లక్ష్యం.''-దగ్గుబాటి పురందేశ్వరి బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు

AP BJP Chief Purandeswari Comments: మద్యం అవినీతిలో కర్త, కర్మ, క్రియ వైసీపీ ప్రభుత్వమే: పురందేశ్వరి

రాష్ట్రంలో అరాచక, కక్ష్యపూరిత రాజకీయం నడుస్తోంది: దగ్గుబాటి పురందేశ్వరి
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.