ETV Bharat / state

కరోనాను రాజకీయం చేయాలని చూస్తున్నారు: ఎమ్మెల్యే గణేష్

author img

By

Published : Apr 18, 2020, 8:07 PM IST

కరోనాను రాజకీయం చేసి తెదేపా నాయకులు లబ్ధి పొందాలని చూస్తున్నారని నర్సీపట్నం ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ అన్నారు.

narisipatnam MLA uma shankar ganesh PRESS MEET
నర్సీపట్నం ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్

ప్రపంచాన్ని పీడిస్తున్న కరోనా వైరస్ పై రాజకీయం చేసి లబ్ది పొందాలని తెలుగుదేశం పార్టీ నేతలు ప్రణాళిక చేస్తున్నారని... ఈ ప్రయత్నాన్ని తిప్పి కొట్టాల్సిన అవసరం ఉందని విశాఖ జిల్లా నర్సీపట్నం ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ పేర్కొన్నారు. కరోనా పై వాస్తవాలను దాయాల్సిన అవసరం తమకు లేదని చెప్పారు. ఈ విషయాన్ని తెదేపా నేతలు గుర్తుంచుకోవాలన్నారు. ఆంగ్ల మాధ్యమం జీవోపై న్యాయస్థానం ఇచ్చిన తీర్పు దృష్టిలో ఉంచుకొని సంబరాలు చేసుకోవడం తెలుగుదేశం నేతలకు తగదని వ్యాఖ్యానించారు.

ఇవీ చదవండి:

కరోనా రోగిని కాపాడేదిలా..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.