ETV Bharat / state

నేడు విశాఖకు పవన్​కల్యాణ్​.. ప్రధాని మోదీతో భేటీ

author img

By

Published : Nov 10, 2022, 6:02 PM IST

Updated : Nov 11, 2022, 6:50 AM IST

మోదీతో భేటీ కానున్న జనసేన అధినేత
మోదీతో భేటీ కానున్న జనసేన అధినేత

18:00 November 10

రెండు రోజుల పాటు విశాఖలోనే పవన్ పర్యటన

Pawan Kalyan meets PM Modi: విశాఖలో ప్రధాని మోదీతో జనసేన అధినేత పవన్ కల్యాణ్​ భేటీ కానున్నారు. ఈ మేరకు భాజపా ప్రకటన విడుదల చేసింది. నేడు ప్రధాని మోదీ విశాఖలో పర్యటించనుండగా.. రాత్రి 8.30 గంటలకు పవన్​కల్యాణ్​ భేటీ అవుతారని భాజపా నేతలు ప్రకటించారు. ఈ ప్రకటనతో వీరిద్దరి భేటీపై రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు పవన్ కల్యాణ్.. హైదరాబాద్​ బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో విశాఖ రానున్నారు. ఈ నెల 13వ తేదీ వరకూ రెండు రోజుల పాటు విశాఖలోనే పవన్ పర్యటిస్తారు. ప్రధాని పర్యటిస్తున్న సమయంలోనే టిడ్కో ఇళ్ల... సోషల్ ఆడిట్ అంశంపై జనసేన ప్రకటన చేయనుండటం విశేషం.

ఇవీ చదవండి:

Last Updated :Nov 11, 2022, 6:50 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.