విశాఖలో ఈనాడు గ్రాండ్​ ప్రాపర్టీ ఎక్స్​పో కు విశేష స్పందన

author img

By

Published : Oct 2, 2022, 2:07 PM IST

Eenadu Grand property Expo

Property Expo: విశాఖలో రెండు రోజులపాటు గ్రాండ్​ ప్రాపర్టీ ఎక్స్​పో జరుగుతోంది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న స్థిరాస్తి వ్యాపారులు.. కొనుగొలుదారులకు మేలు చేస్తుందని అభిప్రాయపడ్డారు. ఈ ప్రాపర్టీ ఎక్స్​పో వల్ల స్థిరాస్తి కంపేనీలు ఒకే వేదికపైకి రానున్నాయి. దీంతో కొనుగొలుదారులకు స్థిరాస్తి కొనుగొలు ఎంపిక ప్రక్రియ సులభం కానుంది.

Eenadu Grand property Expo: విశాఖలో ఈనాడు గ్రాండ్ ప్రాపర్టీ ఎక్స్ పో 2022కు స్థిరాస్తి సంస్థల నుంచి మంచి స్పందన వచ్చింది. శనివారం ప్రారంభమైనా ఈ కార్యక్రమం అదివారం కొనసాగనుంది. విశాఖ నోవొటెల్‌లో జరుగుతున్న ఈ కార్యక్రమంలో దాదాపు 35కి పైగా రియల్ ఎస్టేట్ , భవన నిర్మాణ సంస్థలు, బ్యాంకులు పాల్గొన్నాయి. ఈ గ్రాండ్ ప్రాపర్టీ ఎక్స్‌పోను విశాఖ పోర్టు అథారిటీ ఛైర్మన్ రామ్మోహనరావు ప్రారంభించారు. విశాఖలో స్థిరాస్తి కొనుగోలుకి ఇదే మంచి సమయమని రియల్ ఎస్టేట్ రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

విశాఖలో రెండు రోజులపాటు ఈనాడు గ్రాండ్​ ప్రాపర్టీ ఎక్స్​పో

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.