ETV Bharat / state

COUPLE DIED IN VISAKHAPATNAM: కుటుంబ కలహాలతో భార్యను హత్య చేసిన భర్త.. ఆ తరువాత తానూ..

author img

By

Published : Dec 16, 2021, 8:58 AM IST

Updated : Dec 16, 2021, 2:14 PM IST

COUPLE DIED IN VISHAKHAPATNAM
విశాఖపట్నంలో దంపతులు మృతి

Vishaka couple death news: కుటుంబ కలహాలతో భార్యను చంపిన భర్త.. అనంతరం అతనూ ఉరేసుకొని మృతిచెందాడు. ఈ విషాద ఘటన విశాఖపట్నం జిల్లా శ్రీహరిపురం గొల్లలపాలెంలో జరిగింది.

wife murdered by husband in Visakhapatnam: విశాఖపట్నం జిల్లా శ్రీహరిపురం గొల్లలపాలెంలో దారుణం చోటు చేసుకుంది. భార్య మాధవిని భర్త శివనాగేశ్వర రావు హత్య చేశాడు. భార్యను హత్యచేసి అనంతరం అతనూ ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. గొల్లలపాలెంలో నివాసముంటున్న దంపతులు మాధవి, శివనాగేశ్వరరావు. ఆలుమగల మధ్య అనుమానం పెనుభూతంగా మారింది.

Vishaka couple death news: ఈ క్రమంలో భార్యపై అనుమానం పెంచుకున్న భర్త శివనాగేశ్వరరావు.. ఇవాళ ఆమెను ఇనుప డంబెల్‌తో కొట్టి హత్యచేశారు. అనంతరం తాను ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు.. ఘటనా స్థలానికి చేరుకున్నారు. రెండు మృతదేహాలను కేజీహెచ్​కు తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.

ఇదీ చదవండి..

Road Accident CCTV Footage: స్కూటీని ఢీ కొట్టిన టిప్పర్​.. ఇంజనీరింగ్​ విద్యార్థిని మృతి

Last Updated :Dec 16, 2021, 2:14 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.