విశాఖ జిల్లా నర్సీపట్నంలో కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో అధికార యంత్రాంగం చర్యలు చేపట్టింది. ఛైర్ పర్సన్ ఆదిలక్ష్మి ఆదేశాల మేరకు ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేశారు. వార్డుల్లో సోడియం హైపోక్లోరైట్ ద్రావణాన్ని పిచికారి చేస్తున్నారు. రెండు వాహనాలతో రోజుకు రెండు సార్లు పాజిటివ్ కేసులు ఉన్న చోటే కాకుండా.. ఇతర ప్రాంతాల్లోనూ పిచికారి చేస్తున్నట్లు మున్సిపల్ కమిషనర్ కనకారావు అన్నారు. దీనికి తోడు బ్లీచింగ్ చల్లి ముందస్తు చర్యలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు.
ఇదీ చదవండి: రేపటి నుంచే పగటి కర్ఫ్యూ.. ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 12 వరకే దుకాణాలు