ETV Bharat / state

'పరిశ్రమల్లో రసాయనాలు.. ఎట్టి పరిస్థితుల్లో బయటికి వెళ్లొద్దు'

author img

By

Published : Jun 3, 2020, 6:15 PM IST

విశాఖలో గ్యాస్ లీకేజ్ వంటి ఘటనలు పునరావృతం కాకుండా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. నగరంలోని రాంకీ హబ్ లో.. పరిశ్రమల్లో మిథనాల్, రసాయనాల వాడకంపై అవగాహన సదస్సు నిర్వహించారు.

vishaka district
పరిశ్రమల్లో మిధనాల్, రసాయనాల వాడకంపై అవగాహన సదస్సు

పరిశ్రమల్లో ఉపయోగించే మిథనాల్, ఇతర రసాయనాలు ఎట్టి పరిస్థితుల్లో బయటకు వెళ్లకుండా చూడాలని స్పెషల్ ఎన్ఫోర్స్​మెంట్ బ్యూరో అర్బన్ విభాగం ప్రత్యేక అధికారి అజిత్ వేజెండ్ల చెప్పారు. విశాఖ రాంకీ హబ్​లో... పరిశ్రమల్లో మిథనాల్, ఇతర రసాయనాల వాడకంపై ఆయన ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జరిగింది.

విశాఖ జిల్లాలోని పరవాడ, భీమిలి, గాజువాక, పెందుర్తి ప్రాంతాలకు చెందిన వివిధ ఫార్మా సంస్థల నుంచి 120 మంది ప్రతినిధులు హాజరయ్యారు. వీరికి పరిశ్రమల్లో రసాయనాల పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలను అధికారులు సూచించారు. జిల్లా ఎక్సైజ్ అధికారులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి:

తీరాన్ని తాకిన నిసర్గ తుపాను

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.