ETV Bharat / state

తిరుమల శ్రీవారి సేవలో కేంద్రమంత్రి హర్దీప్ సింగ్ పురి

author img

By

Published : May 29, 2022, 12:01 PM IST

Central Minister to Tirumala: కేంద్రమంత్రి హర్దీప్ సింగ్ పురి.. తిరుమల స్వామివారిని దర్శించుకున్నారు. వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో స్వామివారి సేవలో పాల్గొన్నారు. స్వామివారిని దర్శనం చేసుకున్న ప్రతిసారీ కొత్త ఉత్సాహం, స్ఫూర్తి లభిస్తాయని ఆయన చెప్పారు.

union minister hardeep singh puri visited tirumala
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న కేంద్రమంత్రి హర్దీప్ సింగ్ పురి

కేంద్రమంత్రి హర్దీప్ సింగ్ పురి.. తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో స్వామివారి సేవలో పాల్గొన్నారు. తితిదే బోర్డు అధ్యక్షుడు వైవీ సుబ్బారెడ్డి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు ఆశీర్వచనం పలికి, తీర్థప్రసాదాలు అందజేశారు. 1987 నుంచి తిరుమలకు వస్తున్నట్లు హర్దీప్ తెలిపారు. స్వామిని దర్శనం చేసుకున్న ప్రతిసారీ కొత్త ఉత్సాహం, స్ఫూర్తి లభిస్తాయని చెప్పారు.

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న కేంద్రమంత్రి హర్దీప్ సింగ్ పురి

ఇదీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.