ETV Bharat / state

TTD EO Dharma Reddy: "ఆ వార్తలు అవాస్తవం...శ్వేతపత్రం విడుదల చేస్తాం"

author img

By

Published : Nov 5, 2022, 4:42 PM IST

TTD EO Dharma Reddy
తితిదే ఈవో ధర్మారెడ్డి

TTD EO Dharma Reddy: తితిదే ఫిక్స్​డ్ డిపాజిట్ల నగదు విషయంలో సామాజిక మాధ్యమాల్లో వస్తున్న వార్తలు అవాస్తమని తితిదే ఈవో ధర్మారెడ్డి స్పష్టం చేశారు. జాతీయ బ్యాంకుల్లో మాత్రమే తితిదే ఫిక్స్​డ్ డిపాజిట్లు చేస్తుందని.. దీనిపై శ్వేతపత్రం విడుదల చేస్తున్నట్లు ఈవో వెల్లడించారు. తితిదే ఫిక్సిడ్ డిపాజిట్లు విషయంలో ఎలాంటి వదంతులు నమ్మవద్దన్నారు.

తితిదే ఈవో ధర్మారెడ్డి

TTD EO Dharma Reddy తితిదేకు సంబంధించిన మెచ్యూరిటీ పూర్తయిన ఐదు వేల కోట్ల ఫిక్స్​డ్ డిపాజిట్లను రాష్ట్ర ప్రభుత్వం బాండ్స్ రూపంలో డిపాజిట్ చేస్తున్నట్లు సామాజిక మాధ్యమాల్లో వస్తోన్న వార్తలు.. అవాస్తమని తితిదే ఈవో ధర్మారెడ్డి స్పష్టం చేశారు. ఈ ఉదయం తిరుమల అన్నమయ్య డయల్ యువర్ ఈవో కార్యక్రమంలో భక్తులతో మాట్లాడిన అనంతరం.. ఈవో ధర్మారెడ్డి మీడియాతో మాట్లాడారు. జాతీయ బ్యాంకుల్లో మాత్రమే తితిదే ఫిక్స్​డ్ డిపాజిట్లు చేస్తుందని దీనిపై శ్వేతపత్రం విడుదల చేస్తున్నట్లు ఈవో ధర్మారెడ్డి వెల్లడించారు. తితిదే ఫిక్స్​డ్ డిపాజిట్లు విషయంలో ఎలాంటి వదంతలు నమ్మవద్దన్నారు. తిరుమల శ్రీవారికి సంబంధించిన మొత్తం 15,900 కోట్ల ఫిక్స్​డ్ డిపాజిట్లు వివిధ జాతీయ బ్యాంకుల్లో ఉన్నాయన్నారు.

హిందూ మత ద్వేషులు తితిదేపై అసత్య ప్రచారాలు చేస్తున్నారన్నారు. డిసెంబర్ 1 నుంచి ప్రయోగత్మకంగా విఐపీ బ్రేక్ దర్శనం ఉదయం 8 గంటల నుంచి మొదలవుతుందని దీని వల్ల డిసెంబర్ నెల రూ.300 దర్శనం కోటా జాప్యం జరిగిందన్నారు. తిరుపతిలో ఇస్తున్న ఎస్ఎస్​డీ టోకెన్లను ఇంకా పెంచాలని చాలా మంది భక్తులు కోరినట్లు తెలిపారు. శ్రీవారి ఆలయంలో ఆనంద నిలయం బంగారు తాపడం పనుల కోసం వచ్చే పాలకమండలి సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని ఆయన తెలిపారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.