సమస్యలపై నిలదీసిన ప్రజలు.. ఎమ్మెల్యే తిరుగుముఖం

author img

By

Published : Jun 21, 2022, 5:13 PM IST

Updated : Jun 21, 2022, 6:03 PM IST

ఎమ్మెల్యే ఆదిమూలంకు నిరసన సెగ..

People questioned MLA on local issues: తిరుపతి జిల్లా సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలంకు చేదు అనుభవం ఎదురైంది. గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా కేవీబీపురం మండలం బ్రాహ్మణపల్లికి వెళ్లిన ఎమ్మెల్యేని వివిధ సమస్యలపై స్థానికులు నిలదీశారు. సమస్యలపై నిలదీయటంతో గ్రామం నుంచి ఎమ్మెల్యే తిరుగుముఖం పట్టారు.

సమస్యలపై నిలదీసిన ప్రజలు.. ఎమ్మెల్యే తిరుగుముఖం

MLA Adimulam return from programme: 'గడప గడపకు మన ప్రభుత్వం' పేరిట జనంలోకి వెళ్లిన సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలంకు నిరసన సెగ తగిలింది. కేవీబీపురం మండలం బ్రాహ్మణపల్లికి వెళ్లిన ఎమ్మెల్యేను వివిధ సమస్యలపై స్థానికులు నిలదీశారు. ఇళ్ల బిల్లులు మంజూరు కాలేదని.. దాంతో అప్పుల పాలవుతున్నామని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాగునీటి పథకానికి విద్యుత్ సరఫరా చేయకపోవడం వల్ల ఇబ్బందులు పడుతున్నామని మండిపడ్డారు. గ్రామస్థులకు నచ్చజెప్పేందుకు వైకాపా నాయకులు ప్రయత్నించినా ఉపయోగం లేకపోయింది. సమస్యలపై నిలదీయటంతో గ్రామం నుంచి ఎమ్మెల్యే తిరుగుముఖం పట్టారు.

ఇదీ చదవండి :

Last Updated :Jun 21, 2022, 6:03 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.