Nara Lokesh: శ్రీకాకుళం జిల్లాలో ఐదుగురిపై దాడి..వైకాపాపై నారా లోకేశ్​ ఫైర్​

author img

By

Published : Oct 2, 2021, 3:25 PM IST

Updated : Oct 2, 2021, 4:06 PM IST

నారా లోకేశ్

శ్రీకాకుళం జిల్లా బూర్జ మండలం సుంకరిపేటలో కొందరు దుండగులు దాడి(attack) చేయడంతో ఐదుగురికి గాయలయ్యాయి. అయితే ఈ దాడి చేసింది వైకాపా నేతలేనని నారా లోకేశ్​ ఆరోపించారు.

శ్రీకాకుళం జిల్లా బూర్జ మండలం సుంకరిపేటలో కొందరు విచక్షణారహితంగా కర్రలు, రాళ్లతో దాడి(attack) చెయ్యడంతో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ దాడికి తెగబడింది వైకాపా నాయకులేనని తెలుగు దేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్​ ఆరోపించారు. నిందితుల్ని కఠినంగా శిక్షించాలని డిమాండ్​ చేశారు.

  • రాష్ట్రంలో దళితులకు జీవించే హక్కు లేదని ఏకంగా గాంధీ జయంతి రోజే దళితుల తలలు పగలగొట్టి మరీ చెప్పారు వైసీపీ నేతలు. శ్రీకాకుళం జిల్లా బూర్జ మండలం సుంకరిపేటలో దళితులపై వైసీపీ నేతల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాను.(1/2) pic.twitter.com/GYaHxjjGUC

    — Lokesh Nara (@naralokesh) October 2, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

గాంధీ జయంతి రోజు ఈ దాడి జరగడంతో వైకాపాపై లోకేశ్​ మండిపడ్డారు. గాయపడిన వారికి సరైన వైద్యం అందించాలన్నారు.

ఇదీ చదవండి: ATTACK: స్థల వివాదంలో ఘర్షణ.. ఎస్సీలపై వైకాపా కార్యకర్తల దాడి

Last Updated :Oct 2, 2021, 4:06 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.