ETV Bharat / state

మనబడి నాడు-నేడు స్కూళ్లను ప్రారంభించిన స్పీకర్​ తమ్మినేని

author img

By

Published : Sep 30, 2021, 10:58 PM IST

స్పీకర్​ తమ్మినేని
స్పీకర్​ తమ్మినేని

శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస మండలంలో పలు అభివృద్ధి పనులకు శాసన సభాపతి తమ్మినేని సీతారాం ప్రారంభించారు . చిన్నజొన్నవలస, గాజులు కొల్లివలస, చిట్టివలసలో మనబడి నాడు నేడు కింద పనులు పూర్తైన పాఠశాలలను పున:ప్రారంభించారు.

శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస మండలంలో పలు అభివృద్ధి పనులకు శాసన సభాపతి తమ్మినేని సీతారాం ప్రారంభోత్సవం చేశారు. ముందుగా చిన్నజొన్నవలస, గాజులు కొల్లివలస, చిట్టివలస, పొన్నంపేటలో మనబడి నాడు నేడు కింద పనులు పూర్తి చేసిన స్కూళ్లను పున: ప్రారంభించారు.

ఆమదాలవలస ఎడ్యుకేషన్​ హబ్​గా మారుతుందని స్పీకర్ అన్నారు. అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లుగా సీఎం జగన్​ ముందుకు నడిపిస్తున్నారని అన్నారు. పాఠశాలలను అభివృద్ధి చేస్తుంటే ప్రతిపక్ష నాయకులు విమర్శిస్తున్నారని అన్నారు. ప్రతి సారి ఇలా విమర్శిస్తున్నందువల్లే స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాల్లో ప్రతి పక్షాలు గల్లంతయ్యాని ఎద్దేవా చేశారు.

ఇదీ చదవండి: Rains Effect: పొంగిపొర్లుతున్న మహేంద్రతనయ నది.. సురక్షిత ప్రాంతాలకు వెళ్తున్న ప్రజలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.