ETV Bharat / state

వలస కూలీల బస్సు, లారీ ఢీ.. బస్సు డ్రైవర్ మృతి

author img

By

Published : May 19, 2020, 1:33 PM IST

శ్రీకాకుళం జిల్లా పలాస మండలం జాతీయ రహదారి టోల్ ప్లాజా వద్ద ఆగి ఉన్న లారీని వలస కూలీల బస్సు ఢీ కొట్టింది. బస్సు డ్రైవర్ మృతి చెందాడు.

srikakulam district
వలస కూలీల బస్సు, లారీ ఢీ.. బస్సు డ్రైవర్ మృతి

శ్రీకాకుళం జిల్లా పలాస మండలం లక్ష్మీపురం జాతీయ రహదారి టోల్ ప్లాజా వద్ద ఆగి ఉన్న లారీని తమిళనాడుకు చెందిన బస్సు ఢీకొట్టింది. ప్రమాదంలో బస్ డ్రైవర్ మృతి చెందాడు.

వలస కూలీలను చెన్నై నుంచి కొలకత్తా తీసుకువెళ్లి తిరిగి వస్తుండగా ప్రమాదం జరిగింది. తీవ్ర గాయాలపాలైన డ్రైవర్​ను పలాస ప్రభుత్వాసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్య సిబ్బంది నిర్ధరించారు.

ఇదీ చదవండి:

రాష్ట్రంలో కొత్తగా 57 కరోనా పాజిటివ్ కేసులు..ఇద్దరు మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.