ETV Bharat / state

Andhra Pradesh Roads in Worst Condition: అడుగుకో గుంత.. ప్రజలకు నరకం.. పట్టించుకోని అమాత్యులు

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Oct 16, 2023, 7:31 AM IST

Updated : Oct 16, 2023, 9:11 AM IST

Andhra Pradesh Roads in Worst Condition: ఆంధ్రప్రదేశ్‌లో అడుగుకో గుంతతో అధ్వానంగా మారిన రహదారులపై రాకపోకలు సాగించేందుకు ప్రజలు నిత్యం నరకం చూస్తున్నారు. అవే రోడ్లపై మంత్రులు మాత్రం హాయిగా తిరుగుతున్నారు. గుంతల వల్ల ఇబ్బందులు వారికి తెలియటం లేదు. ఎందుకంటే.. దాదాపు మంత్రులందరికి కోటికిపైగా ఖరీదైన విలాసవంతమైన కార్లు ఉన్నాయి. గోతులు తేలిన రోడ్లపై వాటిలో ప్రయాణిస్తున్నపుడు కుదుపులు తెలియటం లేదు. తమ నియోజకవర్గాల్లో రోడ్లు ఆధ్వానంగా ఉన్నా.. పట్టించుకోవడం లేదన్న ఆక్రోశం స్థానికుల నుంచి వ్యక్తమవుతోంది.

Andhra Pradesh Roads Condition
Andhra Pradesh Roads Condition

Andhra Pradesh Roads in Worst Condition: అడుగుకో గుంత.. ప్రజలకు నరకం.. పట్టించుకోని అమాత్యులు

Andhra Pradesh Roads in Worst Condition: మంత్రి అంటే తన శాఖ మాత్రమే కాకుండా, ఆయా జిల్లాల్లో ఏ శాఖకు సంబంధించిన అంశాలపై అయినా సమీక్ష నిర్వహించవచ్చు. రోడ్లు గోతులమయంగా ఎందుకు మారాయి? వాటికి మరమ్మతులు ఎందుకు చేయలేకపోతున్నారు? విస్తరణ, పునరుద్ధరణకు ఉన్న అడ్డంకులు ఏంటి? గుత్తేదారులు పనులను ఎందుకు నిలిపివేశారు? వారి బిల్లులు ఎంతకాలం నుంచి ఆగిపోయాయి? ఇలా అన్ని అంశాలపై సమీక్ష నిర్వహిస్తే, ప్రజల కష్టాలు తీరతాయి. కానీ వారికి ఇవేమీ పట్టడం లేదు. పలు జిల్లాల్లోని మంత్రుల నివాస ప్రాంతాలు, క్యాంప్ కార్యాలయాలకు దగ్గరలో ఉన్న రహదారులను ఈటీవీ-ఈనాడు యంత్రాంగం క్షేత్రస్థాయిలో పరిశీలించింది.

ఎన్నికల హామీ ఏమైంది..?: శ్రీకాకుళం జిల్లా పలాస నియోజకవర్గం బెండిగేట్ నుంచి పూండి మీదుగా నౌపడ వెళ్లే రహదారిపైనే మంత్రి సీదిరి అప్పలరాజు తన స్వగ్రామం వజ్రపుకొత్తూరు మండలం దేవునత్తాడకు ఇదేమార్గంలో వెళ్లి వస్తుంటారు. ఎమ్మెల్యే అయ్యాక ఈ రహదారిని విస్తరించి, బాగు చేస్తానని ఎన్నికలకు ముందు చెప్పిన అప్పలరాజు.. మంత్రి అయ్యాక కూడా ఆ విషయం పట్టించుకోవడం లేదని స్థానికులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. రహదారి మరమ్మతులకు టెండర్లు పిలిచినా గుత్తేదార్లు ముందుకు రావటం లేదు.

Damaged Roads in Guntur: "గుంటూరు గుంతల లోతు తెలియడం లేదు.. దేవుడిపైనే భారం వేశాం!"

నాలుగున్నరేళ్లైనా పూర్తి కాని వైనం: శ్రీకాకుళం నుంచి ఆమదాలవలస రహదారి.. ఈ రెండు నియోజకవర్గాలకు రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు, స్పీకర్ తమ్మినేని సీతారామ్‌ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. స్పీకర్ ఆమదాలవలస నుంచి శ్రీకాకుళం రావాలంటే ఇదే రహదారిపై ప్రయాణిస్తారు. 10 కి.మీ. మేర నాలుగు వరసలుగా విస్తరించే పనులు నాలుగున్నరేళ్లుగా పూర్తి చేయలేకపోతున్నారు. కేంద్రం. 40 కోట్లు, భూసేకరణ తదితరాలకు 19కోట్లతో చేపట్టిన పనులు 40శాతమే పూర్తయ్యాయి. 12 కోట్ల రూపాయలు బిల్లులు పెండింగ్లో ఉండటంతో గుత్తేదారు పనులు నిలిపివేశారు.

ఉపముఖ్యమంత్రి రాజన్నదొర స్వగ్రామం.. మర్రివానివలసకు పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు నుంచి మక్కువ వెళ్లేమార్గంలోననే ప్రయాణించాలి. 56 కోట్లతో ఈ రోడ్డు విస్తరణకు రెండున్నరేళ్లక్రితం గుత్తేదారుకు పనులు అప్పగించారు. 4కోట్ల మేర బిల్లులు పెండింగ్ ఉండటంతో పనులు ఆపేశారు.

Pathholes and Highly Damaged Vanukuru Maddur villages Road: పది కిలో మీటర్లకే గంటన్నర పడుతోందని ప్రయాణికుల ఆవేదన..

బిల్లులు రాక.. మధ్యలోనే పనులు..!: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం నుంచి ద్రాక్షారామం మార్గం గుంతలమయమైంది. మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ రామచంద్రపురంలోనే నివాసం ఉండగా, అక్కడి నుంచి ఇది 6 కి.మీ. దూరంలో ఉంది. ద్వారంపూడి నుంచి వేగాయమ్మపేట వరకు 25 కోట్లతో ఈ రహదారి అభివృద్ధి పనులు మంజూరయ్యాయి. బిల్లులు రాకపోవడంతో గుత్తేదారు పనులను మధ్యలో ఆపేశారు.

అమలాపురంలో.. నల్లవంతెన, ఎర్రవంతెనకు మధ్య పంట కాలువకు ఇరువైపులా ఉన్న రోడ్ల దుస్థితి మరీ దారుణంగా ఉంది. ఇవి మంత్రి విశ్వరూప్ ఇంటి నుంచి కేవలం కిలోమీటరు దూరంలోనే ఉన్నాయి. ఈ రహదారి అభివృద్ధి పనులకు 2 కోట్ల రూపాయలతో మంత్రి శంకుస్థాపన చేసి రెండేళ్లయినా అతీగతీ లేదు.

AP Roads Situation రోడ్ల కోసమమంటూ పన్నులు వేశారు .. రుణాలు తీసుకున్నారు! కొత్త రోడ్డు లేదు.. ఉన్నవాటికి రిపేర్లు లేవు..! ప్రచారం మాత్రం పీక్..

పునరుద్ధరణ పనులెప్పుడు..?: తాడేపల్లిగూడెంలోని ప్రత్తిపాడు వై.జంక్షన్-బాదంపూడి వై.జంక్షన్ రోడ్డు పూర్తిగా రాళ్లు తేలింది. తాడేపల్లిగూడెంలో ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ నివాసం నుంచి 2 కిమీ దూరంలో ఉంది. ఆయన నిత్యం ఈ మార్గంలోనే తిరుగుతుంటారు. ఆయనతోపాటు హోంమంత్రి తానేటి వనిత, పౌర సరఫరాల శాఖ మంత్రి కారుమూరు నాగేశ్వరరావు కూడా ఇదే మార్గంలో రాకపోకలు సాగిస్తుంటారు. వైసీపీ ప్రభుత్వం వచ్చాక ఈ రోడ్లో గుంతలు మాత్రమే పూడుస్తూ వచ్చారు. ఇప్పుడు 6కోట్ల 90 లక్షలతో పునరుద్ధరణ పనులకు టెండర్లు పూర్తైనా, గుత్తేదారు పనులు ప్రారంభించ లేదు.

తణుకు మండలం ఇరగవరం వద్ద రోడ్డు ధ్వంసమైంది. తణుకులోని పౌరసరఫరాల శాఖ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు ఈ మార్గంలో రాకపోకలు సాగిస్తుంటారు. ఇక్కడ 2 కి.మీ. మేర రోడ్డు అభివృద్ధికి రెండున్నర కోట్లు మంజూరుకాగా, బిల్లులు చెల్లించకపోవటం గుత్తేదారు పనులను మధ్యలోనే ఆపేశారు.

AP Government Neglecting the Expansion of Roads: 'సీఎం గారు ఒక్కసారి నింగి నుంచి నేలకు దిగండి.. మా కష్టాలు చూడండి'

గుంతలు పూడ్చిన ఆటోడ్రైవర్లు: ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం-త్రిపురాంతకం మార్గంలో.. ఎర్రగొండపాలెం వద్ద దెబ్బతిన్న ప్రాంతమిది. పురపాలక శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ క్యాంప్ ఆఫీసు నుంచి కేవలం 2కి.మీ. దూరంలో ఉంది. అడుగుకో గుంతతో ప్రమాదకరంగా మారటంతో.. వారం కిందట ఆటో డ్రైవర్లు సంఘం సభ్యులు మట్టి వేసి గుంతలు పూడ్చారు. ఈ రోడ్డు అభివృద్ధికి 3 కోట్ల రూపాయలు మంజూరుకాగా, రెండుసార్లు టెండర్లు పిలిచినా, పనులు చేసేందుకు ఎవరూ ముందుకు రాలేదు.

కడప నగరంలోని గోకులాడ్జి-కృష్ణా థియేటర్ మధ్య రహదారి దుస్థితిది. ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషా నివాసానికి కేవలం 100 మీటర్ల దూరంలో ఉంది. మంత్రి ఇంటి నుంచి బయటకొస్తే ఇదే మార్గంలో వెళ్తారు. గోకుల్ లాడ్జి నుంచి అన్నమయ్య కూడలి వరకు రహదారి విస్తరణ పనులు నాలుగేళ్లు కిందట ప్రారంభించగా.. ఇప్పటికే పూర్తి కాలేదు.

Alluri Seetharama Raju Paderu District Roads ప్రాంతమే కాదు.. అక్కడ రోడ్లు కూడా అంతే! పాడేరులో లోయలు, వాగులను తలపిస్తున్న రోడ్లు!

మంత్రిగారూ పట్టించుకోరా..!: ఇది కర్నూలు జిల్లా ఆలూరులోని ఆర్​డబ్ల్యూఎస్ కార్యాలయం వద్ద జాతీయ రహదారి పరిస్థితి. మంత్రి గుమ్మనూరు జయరాం నివాసం కేవలం కిలోమీటరు దూరంలోనే ఉంది. ఈ జాతీయ రహదారి కర్ణాటక-ఏపీ సరిహద్దులోని చింతకుంట నుంచి ఆదోని వరకు వెళ్తుంది. ఇక్కడ గుంతలు పూడ్చి, వాహనాలు సాఫీగా వెళ్లేలా కూడా మంత్రి చేయించలేకపోతున్నారు.

Last Updated :Oct 16, 2023, 9:11 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.